భూపాలపల్లి టౌన్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఫీవర్ సర్వే రెండో రోజూ కొనసాగింది. జిల్లాలోని అన్ని పీహెచ్సీల పరిధితో పాటు మున్సిపాలిటీ పరిధిలోని ఆశ, వీఆర్ఏ, అంగన్వాడీ టీచర్లు, ఆర్పీలు ఇంటింటా తిరిగి ఫీవర్ సర్వే చేపట్టారు. మొత్తం 17,759 ఇళ్లను టీం సభ్యులు సందర్శంచి 1,043 మందికి జ్వర లక్షణాలున్నట్లు గుర్తించారు. వారికి మందులు అందజేశారు. జిల్లా వైద్యశాఖ సర్వేలెన్స్ అధికారి డాక్టర్ రవికుమార్ సర్వేను పర్యవేక్షించారు. జిల్లాలో 1107 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 91 మందికి పాజిటివ్ రిపోర్టు వచ్చింది.
చిట్యాలలో..
చిట్యాల: ఒడితల పీహెచ్సీ ఆధ్వర్యంలో ఇంటిం టా జ్వర సర్వే చేపట్టారు. 1543 ఇళ్లలో సర్వేచేసి జలు బు, దగ్గు, జ్వర లక్షణాలు ఉన్న 40 మందికి కరోనా కిట్స్ అందజేశారు. పీహెచ్సీ వైద్యుడు సుభాష్, ఏఎన్ఎంలు, పంచాయతీకార్యదర్శులు, ఆశవర్కర్లు పాల్గొన్నారు.
సుభాశ్కాలనీలో ..
భూపాలపల్లి రూరల్: లక్షణాలు ఉన్న వారు వైద్య పరీక్షలు చేయించుకోవాలని 17వ వార్డు కౌన్సిలర్ ముంజంపెల్లి మురళీధర్ అన్నారు. భూపాలపల్లి పట్టణంలోని సుభాష్కాలనీలో చేపట్టిన ఫీవర్ సర్వేకు ఆయన హాజరయ్యారు. వైద్య సిబ్బందితో కలిసి ఇం టింటికీ వెళ్లి ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్య వివరాలను సిబ్బందికి తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో ఆశ వర్కర్ జ్యోతి, మెప్మా సూపర్వైజర్ సామంతుల నిర్మల, దాసరి బ్రహ్మారెడ్డి పాల్గొన్నారు.
కాటారంలో..
కాటారం: మండలంలో ఫీవర్ సర్వే కొనసాగుతోం ది. వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు, వీఆర్ఏలు, ఐకేపీ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. మండలంలోని దేవరాంపల్లి, గుమ్మళ్లపల్లి గ్రామాల్లో వైద్యాధికారి డాక్టర్ రామారావు సర్వేను పరిశీలించా రు. 1360 ఇళ్లకు వెళ్లి 106 మందికి కిట్స్ అందజేసినట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా 11 మందికి బూస్టర్ డోస్, 62 మందికి కొవీషీల్డ్ రెండో డోసు వేసినట్లు తెలిపారు. పీహెచ్సీలో 131 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 19 మందికి పాజిటివ్ రిపోర్టు వచ్చింది.
మహాముత్తారంలో..
మహాముత్తారం: మండల వ్యాప్తంగా ఫీవర్ సర్వే చేపట్టారు. రెండో రోజు 1173 ఇళ్లలో సర్వే చేపట్టి 57 మందికి హోం ఐసొలేషన్ కిట్లు అందజేసినట్లు వైద్యుడు గోపీనాథ్ తెలిపారు. కార్యక్రమంలో సూపర్వైజర్లు విజయ, రమాదేవి, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
తొమ్మిది మందికి కరోనా :
మండల వ్యాప్తంగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేపట్టారు. 340 మందికి పరీక్షలు చేయగా తొమ్మిది మం దికి పాజిటివ్ రిపోర్ట్ వచ్చినట్లు వైద్యుడు తెలిపారు.
జ్వర సర్వేకు సహకరించాలి
పలిమెల: కరోనా కట్టడికి ముందస్తు చర్యల్లో భాగంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న జ్వర సర్వేకు ప్రజ లు సహకరించాలని ఎంపీడీవో ప్రకాశ్రెడ్డి అన్నారు. మండల కేంద్రంతో పాటు లెంకలగడ్డ, పంకెన గ్రామా ల్లో వైద్య, ఇతర శాఖల సిబ్బంది చేస్తున్న జ్వర సర్వేను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు బాధితులకు వైద్య సిబ్బంది మందుల కిట్ అందజేశారు. కార్యక్రమంలో వైద్య, రెవెన్యూ, పంచాయతీ అధికారులు పాల్గొన్నారు.
కమలాపురంలో ..
మంగపేట: కరోనా నివారణ చర్యల్లో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు మండలంలోని మంగపేట, చుంచుపల్లి, బ్రాహ్మణపల్లి పీహెచ్సీల పరిధి గ్రామాల్లో వైద్య సిబ్బంది జ్వర సర్వే చేపట్టారు. ఇంటింటికీ వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. కొవిడ్ లక్షణాలున్న వారికి మందుల కిట్ అందజేశారు. సెకండ్ డోస్ టీకా వేయించుకోని వారిని టీకా వేశారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యాధికారి నగేశ్నాయక్, సీహెచ్వో సత్యవతి, హెల్త్ సూపర్వైజర్ రాంబాయి, ఏఎన్లు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.
గోవిందరావుపేటలో..
గోవిందరావుపేట: ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటా జ్వర సర్వే కొనసాగుతున్నది. మండలంలోని రెండు పీహెచ్సీల పరిధిలో ఉన్న ఆయా గ్రామాల్లో వైద్య సిబ్బంది, ఆశ వర్కర్లు ఇంటింటికీ వెళ్లి కరోనాపై అవగాహన కల్పిస్తున్నారు. వైద్యాధికారులు సుకుమార్, మధు పాల్గొన్నారు.
వెంకటాపూర్లో..
వెంకటాపూర్: మండల వైద్యాధికారి వినయ్భాస్కర్ ఆధ్వర్యంలో రెండో రోజైన శనివారం ఇంటింటా జ్వర సర్వే చేపట్టారు. ఆరు సబ్సెంటర్ల పరిధిలోని వెంకటాపూర్, పాలంపేట, నర్సాపూర్, నల్లగుంట, లక్ష్మీదేవిపేట, రామాంజపూర్ గ్రామాల్లో ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలతో కలిసి పలువురు బాధితులకు మందులు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్లు మేడబోయిన అశోక్, డోలి రజిత, మందల సుచరితాశ్రీధర్రెడ్డి, సీహెచ్వో సదానందం, ఏఎన్ఎంలు స్వర్ణలత, రజిత, అరుణ, వజ్ర, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.