ప్రతి చిన్నారికి ఆరోగ్యపర్యవేక్షణ కార్డు
ప్రత్యేక డ్రైవ్ చేపట్టిన ఐసీడీఎస్అధికారులు
ఆరోగ్య తెలంగాణ వైపు అడుగులు
పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ప్రశంసలు
కృష్ణకాలనీ, అక్టోబర్ 21 : ఆరోగ్యతెలంగాణే లక్ష్యంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తున్నది. గ్రామాలు, పట్టణాల్లోని అంగన్వాడీ కేంద్రాల ద్వారా పాలు, కోడిగుడ్లు, బాలామృతం పంపిణీ చేస్తున్నది. ప్రధానంగా చిన్నారుల్లో ఎత్తు, బరువు లోపాల నివారణకు చర్యలు తీసుకుంటున్నది. ఆశించిన స్థాయిలో పిల్లల్లో ఫలితాలు రావడం కోసం ఐసీడీఎస్ అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ప్రతి చిన్నారికి ప్రత్యేకంగా ఆరోగ్య పర్యవేక్షణ కార్డును సైతం అందజేసింది. జిల్లాలో భూపాలపల్లి, మహదేవపూర్ రెండు ఐసీడీఎస్ ప్రాజెక్టులున్నాయి. భూపాలపల్లి పరిధిలో ఆరు మండలాలు ఉండగా 417 అంగన్వాడీ, మినీ అంగన్వాడీ సెంటర్లు, మహదేవపూర్ పరిధిలో ఐదు మండలాలు ఉండగా 227 సెంటర్లు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 635మంది అంగన్వాడీ టీచర్లు, 583 మంది ఆయాలు, హెల్పర్లు చిన్నారులకు సేవలందిస్తున్నారు. మహిళా సాధికారత సాధించే దిశగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, సంక్షేమ పథకాలను ఇటీవల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కూడా ప్రశంసించింది.
గర్భిణులు, చిన్నారుల ఆరోగ్యం, పౌష్టికాహారం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గుడ్లు, పాలు అందిస్తున్నది. ముఖ్యంగా 7 నెలల పిల్లల నుంచి మూడేళ్ల పిల్లలకు బాలామృతం అందిస్తున్నది. ఈ బాలామృతం చిన్నారుల పౌష్టికాహార లోపాలను సరిచేయడంతో పాటు వారి ఎదుగుదలకు తోడ్పడుతున్నది. దీనివల్ల చిన్నారుల్లో ఆరోగ్యం పూర్తి స్థాయిలో మెరుగుపడి ఎత్తు, ఎదుగుదల, బరువు లోపాల నివారణకు ఎంతో ఉపయోగపడుతూ సత్ఫలితాలిస్తున్నది. అంతేకాకుండా రాబోయే తరం ఆరోగ్యవంతంగా తయారవుతుంది. బాలామృతం ద్వారా పిల్లల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం కోసం ఐసీడీఎస్ అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలోని 11 మండలాల్లో భూపాలపల్లి, మహదేవపూర్ రెండు ఐసీడీఎస్ ప్రాజెక్టులున్నాయి. భూపాలపల్లి ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో ఆరు మండలాలుండగా వీటీలో 375 అంగన్వాడీ, 42 మినీ అంగన్వాడీలు న్నాయి. ఇందులో 372 మంది అంగన్వాడీ, 42 మంది మినీ అంగన్వాడీ టీచర్లు, 370 మంది ఆయాలు, హెల్పర్లు పని చేస్తున్నారు. మహదేవపూర్ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిదిలో ఐదు మండలాలు ఉండగా 214 అంగన్వాడీ, 13 మినీ అంగన్వాడీలు మొత్తం 227 ఉన్నాయి. ఇందులో 208 మంది అంగన్వాడీ, 13 మంది మినీ అంగన్వాడీ టీచర్లు, 213 మంది ఆయాలు, హెల్పర్లు పని చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 635 మంది అంగన్వాడీ టీచర్లు, 583 మంది ఆయాలు, హెల్పర్లు చిన్నారులకు సేవలందిస్తున్నారు.
పోషకాహర లోపాల నివారణ
జాతీయ పోషకార సంస్థ సాంకేతిక సహకారంతో ఐసీడీఎస్ అధికారులు బాలామృతం ద్వారా చిన్నారులకు బలవర్థకమైన ఆహారాన్ని అందిస్తున్నారు. ఇటీవ లే ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రోత్ మానిటరింగ్ రిపోర్టు విషయాన్ని ధృవీకరిస్తున్నది. ఇందులో బాలబాలికలు భేష్ అని తేలింది. మహిళా సాధికారత సాధించే దిశగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చ ర్యలు, సంక్షేమ పథకాలను ఇటీవల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కూడా ప్రశంసించింది. అంగన్వాడీ కేంద్రాల్లో 0-5 ఏండ్ల చిన్నారుల్లో ఎంతమంది వయస్సుకు తగిన ఎత్తు, బరువు ఉన్నారనే వివరాలు సేకరించింది. జిల్లాల వారీగా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, వైద్యారోగ్య శాఖలు సమన్వయంతో ఆయా అంగన్వాడీ కేం ద్రాల్లోని పిల్లల వయస్సు, బరువు, ఎత్తుతో సహా ఆరో గ్య స్థితిగతులను పరీక్షించింది. ప్రతి చిన్నారికి ప్రత్యేకంగా ఆరోగ్య పర్యవేక్షణ కార్డును సైతం అందజేసింది.
ఉపయోగించిన పదార్థాలు
ఏడు నెలల నుంచి మూడేండ్ల మధ్య పిల్లలకు అవసరమైన పోషకాహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఐసీడీఎస్ ద్వారా బాలామృతం అందిస్తున్నది. ఇందులో వేయించిన గోధుమ పిండి, శనిగపిండి, చక్కెర, పాలపొడి, పిల్లలకు వసరమైన ఇనుము, క్యాల్షీయం, విటమిన్లు, విటమిన్ ఖనిజ లవణాలతో కూడిన ఆహారం ఉంటుం ది. ప్రతి చిన్నారికి 100 గ్రాముల పరిమాణంలో ప్రతి రోజూ 3 నుంచి 5 సార్లు అందిస్తున్నారు. ఏడాదిలోపు పిల్లలకు బాలామృతం వేడి నీటిలో కలిపి గంజిగా, పెద్ద పిల్లలకైతే లడ్డూ రూపంలో అందించవచ్చు. బాలామృతాన్ని ప్రతి బిడ్డకు నెలకు 2.5 కిలోల ప్యాకెట్ పంపిణీ చేస్తారు. ఇది ప్రతి నెలా మొదటి రోజు న్యూట్రీషన్ హెల్త్డే 1వ తేదీన, 7 నెలల తల్లులకు, 3 ఏళ్ల పిల్లలకు టేక్హోం రేషన్గా ప్రతి నెలా పంపిణీ చేస్తారు.
భళా బాలామృతం
మన బాలామృతాన్ని పార్లమెంటరీ కమిటీ మెచ్చుకున్నది. చిన్నారుల సంరక్షణ, ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభు త్వం ప్రత్యేక దృష్టి పెట్టి పాలు, గుడ్లతో పాటు పిల్లల వయస్సుకు తగ్గ ఎత్తు, బరువు పెరగడానికి అంగన్వా డీ కేంద్రాల ద్వారా పోషకాలు కలిగిన బాలామృతాన్ని అందిస్తుండడంతో పార్టమెంటరీ స్టాండింగ్ కమిటీ సెప్టెంబర్లో ప్రశంసల జల్లు కురిపించింది. కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్తో పాటు బాలామృతం అత్యద్భుతం అని కొనియాడింది.
30 రోజుల్లో ఉపయోగించాలి..
బాలామృతం ప్యాకెట్ విప్పిన 30 రోజుల్లో పూర్తిగా ఉపయోగించాలి. గాలి, తేమ తగలకుండా డబ్బాలో నిల్వ చేయాలి. పొడి ప్రదేశంలో నిల్వ చేయాలి. క్రిమి, కీటకాలు, ఎలుకల భారినపడకుండా భద్రపరుచుకోవాలి.