ములుగు జిల్లాలో 212, జయశంకర్ భూపాలపల్లిలో 400 టీమ్లతో సర్వే
మొదటి రోజు 12,208, 15, 481 ఇండ్ల సందర్శన
ఇంటింటికీ వెళ్లి కొవిడ్ లక్షణాలున్న వారి గుర్తింపు
రెండు జిల్లాల్లో 932 కిట్లు అందజేత
ములుగు, జనవరి21(నమస్తే తెలంగాణ)/భూ పాలపల్లి టౌన్: కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఓ వైపు కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తూ, మరోవైపు బూస్టర్ డోస్ అందిస్తున్నది. వైరస్ను క్షేత్రస్థాయిలోనే అరికట్టాలని భావించి రాష్ట్రంలో ఫీవర్ సర్వే చేపట్టింది. ఈ మేరకు ములుగు జిల్లాలో 212, జయశంకర్ భూపాలపల్లిలో 400 బృందాలు శుక్రవారం జ్వర సర్వే ప్రారంభించాయి. మొదటి రోజు వైద్యబృందాలు ఆయా జిల్లాల్లో 12208, 15481 గృహాలను సందర్శించింది. ఇంటింటీకీ తిరిగి ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలు తెలుసుకోవడంతోపాటు దగ్గు, జలుబు, జ్వరం, ఒళ్లు నొప్పుల వంటి లక్షణాలున్న వారిని గుర్తించాయి. మొత్తం రెండు జిల్లాల్లో కలిపి 932 హోం ఐసొలేషన్ కిట్లు అందజేశాయి. కొవిడ్ నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మందుల వాడకంపై అవగాహన కల్పించాయి.
కరోనా వైరస్ను అరికట్టేందుకు ప్రభుత్వ ఆదేశాలతో ములుగు, జయశంకర్ భూ పాలపల్లి జిల్లాల్లో వైద్య సిబ్బంది శుక్రవారం ఇం టింటా సర్వే చేశారు. ప్రజల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకోవడంతోపాటు వ్యాధులపై అవగాహన కల్పించారు. మొదటి రోజు ములుగు జిల్లాలో 15 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 212 బృం దాలు 12208 ఇండ్లను సర్వే చేశాయి. జ్వర పీడి తుల నుంచి మలేరియాకు సంబంధించిన ఆర్డీటీ తోపాటు కరోనా పరీక్షలు నిర్వహించాయి. 1129 మందికి కరోనా పరీక్షలు చేసి 83 మందికి వైరస్ సోకినట్లు గుర్తించాయి. వారికి హోం ఐసొలేషన్ కిట్లు అందజేశాయి. అదేవిధంగా 1019 మంది అనుమానితులను గుర్తించి వారికి కరోనాపై జా గ్రత్త చర్యలు వివరించి అవసరమైన మందులను అందించారు. ప్రజలు కరోనా నిబంధనలు పాటిం చడంతోపాటు విధిగా మాస్కులు ధరించి శానిటై జర్ వాడాలని అన్నారు. కరోనా మొదటి, రెండో డోసులను తీసుకోవడంతోపాటు, అవి పూర్తయిన వారు బూస్టర్ టీకాలను తీసుకోవాలని డీఎంహెచ్ వో అల్లం అప్పయ్య ప్రజలకు సూచించారు. సర్వే లో భాగంగా గ్రామాల్లో టీకాలు వే కోని వారిని సైతం గుర్తించి టీకాలను అందించినట్లు తెలిపా రు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 400 బృం దాలు మొత్తం 15481 ఇండ్లను సందర్శించాయి. 849 మందికి రోగ లక్షణాలు ఉన్నట్లు గుర్తించి ఐసొలేషన్ కిట్స్ అందజేశాయి. ఇందులో అత్యధి కంగా భూపాలపల్లి పీహెచ్సీ పరిధిలో 168, రేగొండ పీహెచ్సీ పరిధిలో 143 మందికి రోగ లక్షణాలు ఉన్నట్లు గుర్తించి కిట్స్ అందజేశారు. గడ్డిగానిపల్లి గ్రామంలో ఫీవర్ సర్వేను మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణి ప్రారంభించారు.