నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
సివిల్ కేసుల్లో పోలీస్ అధికారులు, సిబ్బంది జోక్యం చేసుకోవద్దు
గుట్కా, గంజాయి, మట్కా వంటి వాటిపై నిరంతర నిఘా ఉంచాలి
స్టేషన్కు వచ్చే వారితో మర్యాదగా ప్రవర్తించాలి
నేర సమీక్షా సమావేశంలో భూపాలపల్లి జిల్లా ఎస్పీ సురేందర్రెడ్డి
భూపాలపల్లి, జనవరి 21: జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లలో పెండింగ్లో ఉన్న కేసులను సత్వ రమే పరిష్కరించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ జే సురేందర్రెడ్డి సూచించారు. శుక్ర వారం జిల్లా పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో పోలీస్ అధికారులతో నేర సమీక్షా సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఆధు నిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ప్రతి కేసు ను సమగ్ర పరిశోధన చేయాలని, ప్రధానంగా కే సుల విచారణలో ఎస్వోపీని పాటిస్తూ నేరస్తులకు శిక్ష పడేలా చూడాలన్నారు. నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. దొంగతనం కేసులను సత్వరమే ఛేదించి సొమ్మును రికవరీ చేసి బాధితులకు అందించేలా కృషి చేయాలని అ న్నారు. గుట్కా, మట్కా, జూదం, గంజాయి.. వంటి వాటితోపాటు ఇతర అసాంఘిక కార్యకలా పాలకు పాల్పడే వారిపై నిరంతరం నిఘా ఏర్పా టు చేయాలన్నారు. వివిధ సమస్యలపై పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులతో మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని అన్నారు. సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల ని సూచించారు. వర్టికల్ నందు వెనుకబడి ఉన్న వారు తమ పనితీరును మెరుగుపర్చుకోవాలని అన్నారు. నిందితులపై కేసులు నమోదు చేసేట ప్పుడు వారి గత నేర చరిత్రను కూడా యాడ్ చే యాలని సూచించారు. సివిల్ కేసుల్లో పోలీస్ అధి కారులు, సిబ్బంది జోక్యం చేసుకోవద్దని, చట్టవి రుద్ధమైన పనులు చేసే వారిపై కఠిన చర్యలు తీసు కుంటామని ఎస్పీ హెచ్చరించారు. నేర నియంత్ర ణ, కేసుల ఛేదనకు ఉపయోగపడే సీసీ కెమెరాల ఏర్పాటు ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించి, ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేసేలా కృషి చేయాలన్నారు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్పై అప్రమత్తంగా ఉండాలని, పోలీస్ స్టేషన్లలో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ విధులు నిర్వర్తించాలని సూచించారు. అదే సమయంలో ప్రజలందరూ తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించేలా తగు చర్యలు తీసుకోవాలని, నిబంధ నలు అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేసి, జరిమానాలు విధించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఆర్ఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.