చిట్యాల, జనవరి 21 : భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి కరోనా నుంచి కోలుకోవాలని మండల ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు ఆలయాలు, మసీదులో పూజలు చేశారు. రేగొండ మండలం కొడవటంచ లక్ష్మీనరసింహ ఆలయంలో జడ్పీటీసీ గొర్రె సాగర్, పీఏసీఎస్ చైర్మన్ కుంభం క్రాంతికుమార్రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు పొర్లు దండాలతో మొక్కులు చెల్లించుకున్నారు. ఆంజనేయస్వామి ఆలయంలో టీఆర్ఎస్ మం డలాధ్యక్షుడు ఆరెపల్లి మల్లయ్య ఆధ్వర్యంలో పూజలు చేశారు. మండల కేంద్రం శివారులోని మసీదులో కో ఆప్షన్ సభ్యుడు ఎండీ రాజ్మహ్మద్ ఆధ్వర్యంలో ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్లు పుట్టపాక మహేందర్, పూర్ణచందర్రావు, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు జంబుల తిరుపతి, నాయకులు మ న్నెం శ్రీనివాస్, పువ్వాటి వెంకన్న, కట్కూరి నరేందర్, కిష్టయ్య, పాండ్రాల స్వామి, ఆనంద్రెడ్డి, పెరుమాండ్ల రవీందర్, అజ్మత్మియా, హైదర్పాషా పాల్గొన్నారు.
సీతారామాంజనేయ స్వామి ఆలయంలో..
భూపాలపల్లి రూరల్ : ఎమ్మెల్యే గండ్ర దంపతులు కరోనా నుంచి కోలుకోవాలని టీఆర్ఎస్ నాయకులు మున్సిపాలిటీ పరిధి సుభాశ్కాలనీలో ఉన్న సీతారామాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో 17వ వార్డు కౌన్సిలర్ ముంజంపెల్లి మురళీధర్, కో ఆప్షన్ సభ్యుడు బేతోజు వజ్రమణి, అర్బన్ ప్రధాన కార్యదర్శి బీబీ చారి, ఆలయ కమిటీ చైర్మన్ మచ్చ సారయ్య, అర్చకులు వరప్రసాద్, అర్బన్ సెల్ అధ్యక్షుడు చుక్క బాలరాజు గౌడ్, జిల్లా నాయకులు నరసింహాచారి, బ్రహ్మారెడ్డి, రమేశ్, మోహనాచారి, రాజు, శ్రీరామ్ పాల్గొన్నారు.
గణపురంలో..
గణపురం : ఎమ్మెల్యే గండ్ర దంపతులు కోలు కోవా లని కోరుతూ పీఏసీఎస్ చైర్మన్ పోరెడ్డి పూర్ణచందర్ రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పోలుసాని లక్ష్మీ నరసింహరావు, నాయకులు మోతె కర్ణాకర్రెడ్డి మేడా రం సమ్మక్క-సారలమ్మ సన్నిధిలో పూజలు చేశారు.