ములుగురూరల్, జనవరి 21 : కార్యకర్తలకు అండ గా టీఆర్ఎస్ పార్టీ ఉంటుందని ఆ పార్టీ మండల అధ్యక్షుడు బాదం ప్రవీణ్ అన్నారు. స్థానిక జడ్పీటీసీ సకినాల భవాని, ఎంపీపీ గండ్రకోట శ్రీదేవీసుధీర్యాదవ్ సమక్షంలో పార్టీ నుంచి మంజూరైన బీమా చెక్కులను మృతుల కుటుంబాలకు శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొద్ది రోజుల క్రితం మృతి చెందిన బండారుపల్లి, ఇంచర్ల గ్రామాలకు చెందిన ఈట్టవేని రమేశ్, అల్లం శివాజీ కుటుంబాలకు పార్టీ నుంచి మంజూరైన రూ.2 లక్షల చెక్కులను వేర్వే రుగా అందజేశారు. పార్టీ సభ్యత్వం తీసుకున్న 60 లక్షల మంది కార్యకర్తలకు సీఎం కేసీఆర్ అండగా నిలు స్తున్నారన్నారు. జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ ఆదేశాల మేరకు చెక్కులు పంపిణీ చేసినట్లు చెప్పారు. కార్య క్రమంలో ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు పోరిక విజయ్రాంనాయక్, ఎంపీటీసీలు ఎన్ మహేశ్, సమ్మ య్య, సుజాతారాజు, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు కుటుంబరావు, నాయకుడు పోరిక గోవింద్నాయక్, ఉప సర్పంచ్ మహేందర్ పాల్గొన్నారు.
పాలంపేటలో…
వెంకటాపూర్:మండలంలోని పాలంపేట గ్రామానికి చెందిన పోషబోయిన సంపత్ ఇటీవల ప్రమాదంలో మృతి చెందాడు. ఈ నేపథ్యంలో పార్టీ నుంచి మంజూ రైన రూ.2లక్షల ప్రమాద బీమా చెక్కును టీఆర్ఎస్ నాయకులు మృతుడి కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్ చొరవతో చెక్కు అందజేసినట్లు తెలి పారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా నాయకులు గోవింద్నాయక్, సర్పంచ్ డోలి రజితాశ్రీనివాస్, డీసీసీబీ డైరెక్టర్ మాడుగుల రమేశ్, ఎంపీటీసీ పోశాల అనితావీరమల్లు, కో ఆప్షన్ సభ్యుడు జహీర్పాషా, గ్రామశాఖ అధ్యక్షుడు దావు బాబు, నాయకులు కారు పోతుల సత్యం, తండా రమేశ్, బొమ్మ రమేశ్, పైడి, అంజయ్య పాల్గొన్నారు.