భూపాలపల్లి రూరల్, జనవరి 21 : నీతి ఆయోగ్ సహకారంతో చేపట్టిన పనులు నాణ్యతగా ఉండాలని నీతి ఆయోగ్ అదనపు కార్యదర్శి సంజయ్ కుమార్ జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టర్తో పాటు జిల్లా స్థాయి అధికారులతో శుక్రవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో నీతి ఆయోగ్ ద్వారా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్ర మాల ప్రగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ ఉమ్మడి జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలోని పేదరి క స్థాయిని గుర్తించి నీతి ఆయోగ్ ఆస్పి రేషన్ డిస్ట్రిక్ట్ కార్యక్రమంలో వాటిని ఎంపిక చేసినట్లు తెలి పారు. విద్య, వైద్యం, వ్యవ సాయం, అను బంధ రంగాలు, పాడిపరిశ్రమ, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన, ఆర్థిక తోడ్పాటు, మౌలిక వసతుల కల్పన కోసం జిల్లాలో చేపట్టిన పనులు ఎక్కువ కాలం ఉండేలా చూడాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి నాణ్యతగా పనులు చేపట్టాలని, ఎప్పటికప్పుడు ఆన్లైన్లో వాటి వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు. నీతి ఆయోగ్ ర్యాంకింగ్లో రెండు జిల్లాలు మొదటి స్థానంలో నిలి చేలా అధికారులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధికి రూ. 10 కోట్లు
కలెక్టర్ భవేశ్ మిశ్రా మాట్లాడుతూ నీతి ఆయోగ్ సహకారంతో జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధికి రూ. 10 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఈ నిధులతో కేంద్రాల మరమ్మతులు, డిజిటల్ క్లాస్ రూమ్, స్మార్ట్ టీవీ, కిచెన్ షెడ్ల ఆధునీకరణ, ఆట వస్తువులు, అభ్యసన సామగ్రిని సమకూర్చనున్నట్లు వివరించారు. అధికారుల సహకారంతో జిల్లాను అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు చర్యలు చేపడుతు న్నట్లు ఆయన చెప్పారు. కార్యక్రమంలో నీతి ఆయోగ్ డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్ రాహుల్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి పురుషోత్తం, డీఎంహెచ్వో డాక్టర్ శ్రీరామ్, జిల్లా వ్యవసాయ అధికారి విజయ్భాస్కర్, డీపీవో ఆశాలత, సీపీవో సామ్యూల్, విద్యాశాఖ ఏఎంవో మనోహర్నాయక్ పాల్గొన్నారు.