బాహుబలి తర్వాత ప్రభాస్ సినిమాలకు బడ్జెట్ చాలా పెరిగిపోతుంది. సాహో సినిమాను దాదాపు 140 కోట్లతో నిర్మించారు. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాల కోసం హాలీవుడ్ స్టంట్స్ మాస్టర్స్ పనిచేశారు. ఇప్పుడు రాధే శ్యామ్ సినిమా కోసం కూడా భారీగానే ఖర్చు చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాల కంటే కూడా విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఎక్కువగా ఖర్చు చేస్తున్నారట. ప్రేమకథలో వీఎఫ్ఎక్స్ ఎందుకుంటుందని అనుకోవచ్చు. కానీ ఈ సినిమాను 60వ దశకంలో జరిగిన అద్భుత దృశ్యకావ్యంగా తెరకెక్కిస్తున్నారు. అందుకే గ్రాఫిక్స్ కోసం ఇంతలా ఖర్చు చేస్తున్నారట.
రాధే శ్యామ్ సినిమా కోసం హైదరాబాద్లో ఏకంగా ఇటలీ దేశం సెట్ నిర్మించారు. దాని కోసం 30 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అక్కడే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేశాడు దర్శకుడు రాధాకృష్ణ. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. అయితే సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత కూడా రిలీజ్ డేట్ ఎందుకు ప్రకటించడం లేదని అభిమానులు కంగారు పడుతున్నారు. అయితే విడుదల విషయంలో చిన్న సమస్య ఉంది. షూటింగ్ పూర్తయింది.. కానీ వీఎఫ్ఎక్స్ వర్క్ మాత్రం ఇంకా 50 శాతం అలాగే ఉండిపోయిందని తెలుస్తుంది. అంతేకాకుండా ప్రభాస్తో కొన్ని సన్నివేశాల షూటింగ్ కూడా బ్యాలెన్స్ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇతర సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్.. మళ్లీ రాధే శ్యామ్ సినిమాకు డేట్స్ ఇచ్చినప్పుడే.. విడుదల తేదీపై ఒక క్లారిటీ వస్తుంది. అప్పటివరకు ఈ కన్ఫ్యూజన్ తప్పదు. మరోవైపు పాన్ ఇండియా సినిమా కావడంతో అన్ని ఇండస్ట్రీల్లో రిలీజ్ డేట్స్ చూసుకొని విడుదల చేసుకోవాలి. ఈ విషయంలో కూడా నిర్మాతలు జాగ్రత్త పడుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే రాధే శ్యామ్ 2021లో వస్తుందా అనేది అనుమానంగానే మారింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
30 ఏళ్ల వ్యక్తిలా కనిపించేందుకు చాలా కష్టపడ్డా: ఫహద్ ఫాసిల్
ఇంత వరకు రీమేక్ల వైపు కన్నేయని మహేష్.. ఎందుకో తెలుసా?
గోవా బీచ్లో విజయ్ దేవరకొండతో ఎంజాయ్ చేస్తున్న బాలీవుడ్ బ్యూటీ
900 కోట్ల రూపాయల అప్పు చేసిన అమితాబ్