ఇబ్రహీంపట్నం, జూలై 12: ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో రెం డు లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం గా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని మున్సిపల్ చైర్పర్సన్ కప్పరి స్రవంతి అన్నారు. హరిత హారంలో భాగంగా సోమవారం శేరిగూడ గ్రామంలో కౌన్సిలర్ అల్వాల జ్యోతి వెంకట్రెడ్డితో కలిసి ఇం టింటికీ మొక్కలను పం పిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ ఏడో విడు త హరితహారంలో ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీని అగ్రస్థానంలో నిలిపే విధంగా కౌన్సిలర్లు, అధికారులు పనిచేయాలన్నారు. కార్య క్రమంలో కమిషనర్ జయంత్కుమార్రెడ్డితో పాల్గొన్నారు.
ఇంటింటికీ మొక్కల పంపిణీ
ఆమనగల్లు, జూలై12: హరితహారం కార్యక్రమంలో పట్టణ ప్రజ లంతా భాగస్వాములై తమ ఇంటి పరిసరాల్లో మొ క్కలు నాటాలని మున్సిపల్ చైర్మన్ రాంపాల్నాయక్, కౌన్సిలర్ విజయ్ కృష్ణ కోరారు. సోమవారం ఆమనగల్లు పట్టణంలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి మొ క్కలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్యాంసుందర్, సిబ్బంది రామకృష్ణ, నాయకులు రాములు పాల్గొన్నారు.
మొక్కలు నాటిన అధికారులు..
మండలంలోని చౌదర్పల్లి గ్రామ రైతువేదిక ఆవరణలో సర్పంచ్ నర్సిరెడ్డి ఆధ్వర్యంలో వ్యవసాయాధికారులు, ప్రజాప్రతినిధులు మొక్కలు నాటారు. జడ్పీటీసీ జంగమ్మ, జిల్లా వ్యవసాయాధికారి గీతారెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, మండల అధ్యక్షుడు జోగిరెడ్డి, అగ్రికల్చర్ ఏడీఏ సత్యనారాయణ, ఏవో సందీప్కుమార్ మొక్కలు నాటారు.