న్యూఢిల్లీ : ఉత్తర భారతంపై పిడుగు పడింది. ఆదివారం రాత్రి ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ర్టాల్లో పిడుగులు పడి 68 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్లో సోమవారం ఉదయం వరకు భారీ పిడుగులు పడ్డాయి. దీంతో యూపీలోనే 41 మంది ప్రాణాలు కోల్పోగా, మధ్యప్రదేశ్లో ఏడుగురు చనిపోయారు. రాజస్థాన్లో పిడుగుపాటుకు 20 మంది బలయ్యారు. వీరిల ఏడుగురు చిన్నారులు ఉన్నారు. మరో 10 మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు.
ఉత్తరప్రదేశ్లో మొత్తం 41 మంది ప్రాణాలు కోల్పోగా.. ఒక్క ప్రయాగ్రాజ్లోనే 14 మంది చనిపోయారు. ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. బాధిత కుటుంబాలకు తక్షణమే సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సీఎం యోగి సానుభూతి తెలిపారు.
రాజస్థాన్లో పిడుగులు పడి 20 మంది చనిపోవడంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఇది బాధాకరమైన విషయమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు మోదీ ట్వీట్ చేశారు. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్.. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం ప్రకటించారు.