బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె నానమ్మ వయోభారం కారణంగా కన్నుమూసారు. అనన్య తండ్రి చుంకీ పాండే అంత్యక్రియలను దగ్గరుండి నిర్వహించారు. తన తల్లి స్నేహలతా పాండేకు చుంకీ పాండే తలకొరివి పెట్టారు. అంత్యక్రియలకు అనన్యతో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు.వీటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి.
అనన్య పాండే ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న లైగర్ సినిమాలో కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే.లాక్డౌన్కి ముందు ముంబైలోఈ మూవీకి సంబంధించిన చిత్రీకరణ జరిగింది. ఆ సమయంలో పూరీ జగన్నాథ్, ఛార్మి, విజయ్ దేవరకొండ అనన్య ఇంట్లో సందడి చేయగా, అందుకు సంబంధించిన ఫొటోలు బయటకి వచ్చాయి. త్వరలో లైగర్ తదుపరి షెడ్యూల్ మొదలు పెట్టనున్నట్టు సమాచారం.