వరంగల్ అర్బన్ : హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండలంలోని బిజిగిరి షరీఫ్ వద్ద బ్రిడ్జి నిర్మాణ సమయంలో పూడిక పేరుకుపోయింది. దీంతో సాగు నీరు అందడం లేదని స్థానిక రైతులు జమ్మికుంట మండల ఇన్చార్జి వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి ఈ ప్రాంత రైతాంగానికి సాగు నీటి సమస్య ఉండకుండా చూడాలన్నారు.
ఎస్సారెస్పీ స్టేజ్ 1కాలువ DBM 16 మెయిన్ కెనాల్, 6L మైనర్, 6L సబ్ మైనర్, 1L సబ్ మైనర్ కాలువల లైనింగ్ క్లియర్ పనులకు ఎమ్మెల్యే అరూరి భూమి పూజ చేశారు. త్వరలోనే రైతుల సమస్య పరిష్కారం అవుంతుందన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
అభివృద్ధి పనుల్లో అలసత్వంపై మంత్రి పువ్వాడ ఆగ్రహం
ఆమె ఫిర్యాదుతో సువేందు అధికారిపై కేసు నమోదు
మొక్కల సంరక్షణ బాధ్యత స్థానిక సంస్థలదే
నేరేడ్మెట్ పోలీసు స్టేషన్కు గద్దర్
వెయ్యి మొక్కలు నాటించిన మంత్రి పువ్వాడ