మునుగోడు/ చండూరు/ నాంపల్లి/ మర్రిగూడ, నల్లగొండ రూరల్, జూలై 6 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న పల్లె ప్రగతి పనుల్లో నిర్లక్ష్యం వహించే ప్రజాప్రతినిధులు, అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్రెడ్డి హెచ్చరించారు. పల్లె ప్రగతిలో భాగంగా మంగళవారం మునుగోడు, చండూరు, నాంపల్లి, మర్రిగూడ, నల్లగొండ మండలాల్లోని పలు గ్రామాల్లో పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల ఆవరణల్లో విరివిగా మొక్కలు నాటి వందశాతం బతికేలా ప్రత్యేక చొరవ చూపాలని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో మునుగోడు మండల ప్రత్యేకాధికారి హుస్సేన్బాబా, ఎంపీడీఓ యాకూబ్నాయక్, ఎంపీఓ సుమలత, నాంపల్లి ఎంపీపీ శ్వేత, ఎంపీడీఓ శేషుకుమార్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ రవీందర్రెడ్డి, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు. నల్లగొండ మండలంలో డీపీఓ విష్ణువర్ధన్రెడ్డి, ఆర్డీఓ జగదీశ్వరెడ్డి వేర్వేరుగా పర్యటించి పనులను పరిశీలించారు. ఎంపీడీఓ వై.శ్రీనివాస్రెడ్డి, ఎంపీఓ మాధవరెడ్డి, తాసీల్దార్ నాగార్జునరెడ్డి పాల్గొన్నారు.
గ్రామాల్లో మొక్కలు నాటిన అధికారులు, ప్రజాప్రతినిధులు
తిప్పర్తి/ కట్టంగూర్/ శాలిగౌరారం/ కేతేపల్లి/ నార్కట్పల్లి : తిప్పర్తి మండలంలోని రాయినిగూడెంలో ఎంపీపీ నాగులవంచ విజయలక్ష్మి మొక్కలు నాటారు. మండల ప్రత్యేక అధికారి జగన్నాథరావు, ఎంపీడీఓ మహేందర్రెడ్డి పాల్గొన్నారు. కట్టంగూర్ మండలం మునుకుంట్ల, ఈదులూరు, పందనపల్లి, నల్లకుంటబోళ్లు, నారెగూడెం, పందనపల్లి గ్రామాల్లో డంపింగ్యార్డులు, పల్లెప్రకృతి వనం, నర్సరీ, పారిశుధ్య పనులను మండల ప్రత్యేకాధికారి బాలశౌరి పరిశీలించి మొక్కలను నాటారు. ఎంపీపీ ముత్తిలింగయ్య, జడ్పీటీసీ బలరాములు, ఎంపీడీఓ సునీత పాల్గొన్నారు. శాలిగౌరారం మండలం ఊట్కూర్ గ్రామంలో సర్పంచ్ వేముల లింగయ్య రోడ్ల వెంటనున్న పెంటదిబ్బలను ఎత్తి అక్కడి నుంచి తరలించే పనులను ప్రారంభించారు. ఎంపీఓ సుధాకర్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. కేతేపల్లి మండలం కాసనగోడు గ్రామంలో ఎంపీడీఓ భవాని మొక్కలు నాటి పంపిణీ చేశారు. ఏఓ బి.పురుషోత్తం, సర్పంచ్ చల్ల పూలమ్మ, ఏపీఓ కె.రామ్మోహన్ పాల్గొన్నారు. నార్కట్పల్లి మండలం బాజకుంట గ్రామంలో మండల స్పెషల్ ఆఫీసర్ సుచరిత పల్లె ప్రకృతి వనం, డంపింగ్యార్డును పరిశీలించారు. ఆమె వెంట ఎంపీడీఓ సాంబశివరావు ఉన్నారు.
పట్టణ ప్రగతిలో పాల్గొన్న కౌన్సిలర్
చండూరు : మున్సిపాలిటీ పరిధిలో పట్టణ ప్రగతి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మంగళవారం 1వ వార్డు కౌన్సిలర్ కోడి వెంకన్న జేసీబీతో కంపచెట్లను తొలగింపజేశారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్ కమిషనర్ వెంకట్రామ్, కౌన్సిలర్లు యాదయ్య, రాధికాశ్రీనివాస్, రాంగోపాల్, శ్రీనివాసులు, లతీఫ్, పాషా, శ్రీనివాస్చారి, సుధాకర్ పాల్గొన్నారు.
బ్లీచింగ్ చల్లిన సర్పంచ్..
మునుగోడు : మండలంలో రావిగూడెంలో మురుగుకాల్వల వెంట సర్పంచుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి గుర్రం సత్యం బ్లీచింగ్ పౌడర్ చల్లారు.
చెట్లతోనే మానవ మనుగడ
డీసీఎస్ఓ వెంకటేశ్వర్లు
కనగల్ : మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని, చెట్లతోనే మానవ మనుగడ ముడిపడిఉందని డీసీఎస్ఓ వెంకటేశ్వర్లు అన్నారు. కురంపల్లి గ్రామంలోని మహవీర్ పారబోయిల్డ్ మిల్లులో మొక్కలు నాటారు. అంతకుముందు మిల్లును తనిఖీ చేశారు. సీఎంఆర్ డెలివరీని పూర్తి చేయాలని సూచించారు. ఆయన వెంట ఏఎస్ఓ నిత్యానంద, డీటీ విజయ, శ్రీనివాస్ ఉన్నారు.