అభివృద్ధిలో ప్రవాసులను భాగం చేయండి
పంచాయతీరాజ్ రోడ్లకు త్వరలోనే నిధులు మంజూరు
రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
పల్లెప్రగతిలో భాగంగా పలు మండలాల్లో పర్యటన
పలు అభివృద్ధి పనులు ప్రారంభం
జగిత్యాల, జూలై 6 (నమస్తే తెలంగాణ)/జగిత్యాల రూరల్ : సమష్టి కృషితోనే ఆదర్శ గ్రామాలుగా రూపుద్దిదుకుంటాయని, రాష్ట్ర పంచాయతీ రాజ్, రూరల్ డెవలప్ మెంట్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా జగిత్యాల రూరల్ మండలం హబ్సీపూర్ గ్రామంలో సోమవారం రాత్రి పల్లె నిద్ర కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి, మంగళవారం ఉదయం జగిత్యాల ఎమ్మెల్యేతో కలిసి గ్రామంలో పర్యటించారు. అనంతరం జగిత్యాల మండలంలోని కల్లెడ నుంచి గుట్రాజ్పల్లి మీదుగా లక్ష్మీపూర్ వరకు రూ.2.72 కోట్లతో నిర్మించిన బీటీ రోడ్డు, రూ.4 కోట్లతో నిర్మించిన బ్రిడ్జికి శంకుస్థాపన చేశారు. రాయికల్ మండలంలోని అల్లీపూర్ గ్రామంలో రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్తో కలిసి రైతు వేదికను, రూ.7.40 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన పల్లెప్రకృతి వనాన్ని ప్రారంభించారు. భూపతిపూర్లో రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి పల్లెప్రకృతి వనాన్ని పరిశీలించారు. బోర్నపల్లి గ్రామంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కోరుట్ల మండలంలోని చిన్న మెట్పల్లిలో మాదాపూర్ – కట్లకుంట రోడ్డు, బ్రిడ్జి నిర్మాణ పనులు, సంగెం గ్రామంలో రైతు వేదిక, 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ను ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు, జడ్పీ అధ్యక్షురాలు దావ వసంతతో కలిసి ప్రారంభించారు. మెట్పల్లి, ఇబ్రహీంపట్నం మండలాల్లో పర్యటించారు.
ఈ సందర్భంగా ఆయా చోట్ల మంత్రి దయాకర్రావు మాట్లాడుతూ పల్లెప్రగతి పనులు గ్రామంలో ఆశించిన మేర జరగడం లేదని, ఎస్సీ కాలనీలో ఎకడి చెత్త అకడే ఉందని, శిథిలావస్థలో ఉన్న ఇళ్లను తొలగించడం జరగలేదన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామ స్వరూపాన్ని మార్చుకోగలుగుతామన్నారు. గ్రామాల అభివృద్ధిలో భాగంగా హబ్సీపూర్ గ్రామానికి రూ.80 లక్షలు, కల్లెడ గ్రామానికి రూ. కోటిని కేటాయించామన్నారు. వైకుంఠధామాల చుట్టూ గ్రీన్ ఫెన్సింగ్ను ఏర్పాటు చేయాలన్నారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి డంపింగ్ యార్డులకు తరలించి కంపోస్ట్ ఎరువులను తయారు చేసుకుంటున్న ప్రజాప్రతినిధులను, అధికారులను అభినందించారు. గ్రామాలు పూర్తి ఆరోగ్య, పరిశుభ్రతతో విషజ్వరాలు లేని ఆరోగ్య తెలంగాణ అని స్వయంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ప్రకటించారని తెలిపారు. గ్రామాల్లో చిన్నచిన్న మొకలను నాటారని గ్రామపంచాయతీ నిధుల నుంచి 10శాతం వినియోగించి పెద్దపెద్ద మొకలు మాత్రమే నాటాలన్నారు. గ్రామాల అభివృద్ధిలో భాగంగా గ్రామంలోని యువత, వృద్ధులు , రిటైర్డ్ ఉద్యోగులతో కమిటీలను వేసి, గ్రామాన్ని వదిలివెళ్లిన ప్రవాసీల నుంచి గ్రామ అభివృద్ధికి నిధులను సేకరించి ఊరు కోసం పనిచేయాలన్న అభిప్రాయం పెంపొందించాలన్నారు.
ప్రవాసులు సమకూర్చిన నిధుల వివరాలను బోర్డుపై రాయించాలని అన్నారు. బోర్నపల్లిలో సీసీ రోడ్డుకు రూ.25 లక్షలు, జీపీ భవనం కోసం రూ.25 లక్షలను వెంటనే మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి మహిళా బృందానికి రూ.3లక్షలు మిత్తి లేకుండా రుణాలను మంజూరు చేస్తామని ప్రకటించారు. మహిళా సంఘ భవనం కోసం ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ను ఆదేశించారు. సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ పల్లెప్రగతి కార్యక్రమం ఎంతో కోలాహలంగా జరుగుతుందని, పల్లెప్రగతి దేశంలోనే ఒక మోడల్ కార్యక్రమన్నారు. గ్రామ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సమృద్ధిగా నిధులను కూడా సమకూర్చిందని పేరొన్నారు. మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి మంచినీరు అందించేలా ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామం నుంచి ప్రతి గ్రామంలోని మంచినీటి ట్యాంకులకు నీరందిస్తామన్నారు. మరో పది రోజులలో వార్డులకు పైపులైను వేస్తమని పేరొన్నారు. గొర్రెల పంపిణీ కార్యక్రమం ద్వారా 40 లక్షల కుటుంబాలకు యూనిట్లను పంపిణీ చేశామని, జిల్లాలో 2800 డీడీలు కట్టిన కుటుంబాలకు విడుతల వారీగా గొర్రెలను పంపిణీ చేస్తామని తెలిపారు.
దేశంలో ప్రశంసలు అందుకుంటున్న రాష్టం కేవలం తెలంగాణ మాత్రమేనన్నారు. దేశంలోనే తెలంగాణలో కోటీ48 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిందని, జిల్లాలో 5లక్షల 56 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కోనుగోలు చేసి తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు. కలెక్టర్ రవి మాట్లాడుతూ పెద్ద మొకలను అవెన్యూ ప్లాంటేషన్ లో నాటి వాటిని సంరక్షించాలని తెలిపారు. 42 లక్షల మొకల పెంపకం లక్ష్యంగా 7వ విడుత హరితహారం కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ కుమార్ మాట్లాడుతూ నీటివనరులు పెరగడం వల్ల చేపల పెంపకం ద్వారా అనేక మంది జీవనోపాధి పొందుతున్నారని తెలిపారు. పంచాయతీ రాజ్ శాఖ కింద జిల్లాలోని గ్రామీణప్రాంతాల రోడ్లు బాగు చేసుకునేందుకు రూ.50 కోట్ల మంజూరు చేయాలని ఎమ్మెల్యే మంత్రికి విజ్ఞప్తి చేశారు. అనంతరం మార్గమధ్యంలో మంత్రులు సంగంపల్లి గ్రామంలో హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్, ఎంపీపీ సంధ్యారాణి, జడ్పీటీసీ అశ్విని జాదవ్, రూరల్ ఇన్చార్జి ఎంపీపీ రాజేంద్ర ప్రసాద్, ఏఎంసీ చైర్మన్, ప్యాక్స్ చైర్లన్లు సందీప్రావు, పత్తిరెడ్డి మహిపాల్రెడ్డి, కల్లెడ విండో మాజీ చైర్మన్, కౌన్సిలర్ ముస్కు నారాయణ రెడ్డి, సర్పంచులు రాజేశ్వర్ రెడ్డి, మహేశ్వర్ రావు, లత, ఎంపీటీసీలు కవిత, పరుశురాం గౌడ్, నాయకులు దమ్మని బాల ముకుందం, దావ సురేశ్, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.