నందిగామ, జూలై5: తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. సోమవారం నందిగామ మండల కేంద్రంలో సర్పం చ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో రూ.31లక్షలతో నూతనంగా నిర్మి స్తున్న ఎమ్ఆర్సీ భవన నిర్మాణ పనులను ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, జడ్పీ వైస్ చైర్మన్ ఈటగణేశ్, ఎంపీపీ ప్రియాంకగౌడ్లతో కలిసి భూమిపూజ చేసి ప్రారంభించారు. వెంక మ్మ గూడ గ్రామంలో సర్పంచ్ బుయ్యని రజనీతగౌడ్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన మహి ళా సమాఖ్య భవనాన్ని, గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభించారు. అనంతరం పౌష్టికాహారం వాల్పోస్టర్ను ఐసీడీఎస్ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆలోచనలతో రాష్ట్రం అన్ని రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రం, దేశం అభి వృద్ధి చెందినట్లని భావించిన సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమానికి రూపకల్పన చేశారని తెలిపారు. పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాలన్నీ పచ్చదనం, పరిశుభ్రతతో కళకళలా డు తున్నాయన్నారు.
ప్రతి గ్రామంలో నర్సరీలు, పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, రోడ్లు, అన్ని విధాలుగా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమంలో ప్రజలను భాగస్వామ్యం చేయాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు సూ చించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నారాయణరెడ్డి, రాష్ట్ర ఎస్సీ కమిషన్ మాజీ సభ్యులు రాంబాల్నాయక్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నోముల పద్మా రెడ్డి, మాజీ ఎంపీపీ శివశంకర్గౌడ్, వైస్ ఎంపీపీ మంజుల, పీఏసీఎస్ చైర్మన్లు మంజులరెడ్డి, అశోక్, మాజీ చైర్మన్ విఠల్, సర్పంచ్లు నర్సింహులు, జెట్టకుమార్, రమేశ్గౌడ్, చంద్రారెడ్డి, ఎంపీటీసీలు చంద్రపాల్రెడ్డి, కొమ్ముకృష్ణ, కుమారస్వామిగౌడ్, రాజునాయక్, మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యులు బేగ్, జిల్లా ప్రత్యేకాధికారి మోతి, సీడీపీవో నాగమణి, ఎంపీడీవో బాల్రెడ్డి, ఐసీడిఎస్ సూపర్వైజర్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.