అంబర్పేట, జూలై 4 : సీఎం చంద్రశేఖర్రావు ముందుచూపుతోనే పట్టణ ప్రగతి కార్యక్రమం చేపట్టారని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. ఆదివారం నల్లకుంట డివిజన్, తిలక్నగర్లో జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ వై. అమృత, డీసీ వేణుగోపాల్తో కలిసి వ్యర్థాలను తొలగింప జేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పట్టణ ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. చెత్తాచెదారం తొలగించడం, పారిశుధ్యం, హరితహారంలో మొక్కలు నాటడం, దోమల నివారణకోసం ఫాగింగ్ చేయడం వంటివి చేపడుతున్నామని అన్నారు. భవిష్యత్ తరాలకు ఇవ్వాల్సింది ఆస్తులు కాద ని, ఆరోగ్యవంతమైన జీవితమని ఆయన పేర్కొన్నారు. కాలుష్యరహిత వాతావరణం కోసం విరివిగా మొక్కలను నాటాలని కోరారు. అంతరించి పోతున్న అడవుల విస్తీర్ణాన్ని పెంచేందుకు, పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టిన హరితహారం సత్ఫలితాలను ఇస్తున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈ శ్వేత, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి హుస్సేన్, భాస్కర్, సైదులు, జలమండలి గురునాథ్, స్థానిక బస్తీవాసులు సురేందర్, చంద్రశేఖర్, రమేశ్, గోపాల్, రఘు, ఇర్ఫాన, సంధ్య తదితరులు పాల్గొన్నారు.