భువనగిరి అర్బన్, జూలై 3 : పట్టణ ప్రగతిలో భాగంగా వార్డుల్లో సమస్యలు పరిష్కరించి పట్టణాన్ని సుందరీకరణగా మార్చుకోవాలని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో చేపట్టిన పట్టణ ప్రగతిలో భాగంగా ఆయన మొక్క నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..పట్టణంలోని వార్డుల్లో పర్యటించి సమస్యలను గుర్తించాలన్నారు. శిథిలావస్థకు చేరిన పాత ఇండ్లు, చెత్తకుప్పలు, కూలిన డ్రైనేజీలు, సీసీ రోడ్ల సమస్యలను పరిష్కరించాలన్నారు. అనంతరం పట్టణ పరిధిలోని హుసేనాబాద్ కాలనీ సమీపంలోని వైకుంఠధామాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జడల అమరేందర్గౌడ్, మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు, వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య, కమిషనర్ ఎం.పూర్ణచందర్, కౌన్సిలర్ గుండెగల్ల అంజమ్మ ఎల్లయ్య పాల్గొన్నారు.
పట్టణ ప్రగతితో వార్డుల అభివృద్ధి
భూదాన్పోచంపల్లి, జూలై 3 : పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా పోచంపల్లి పట్టణంలోని అన్ని వార్డులను అభివృద్ధి పర్చుకోవాలని చౌటుప్పల్ ఆర్డీవో సూరజ్కుమార్ అన్నారు. శనివారం పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డులోని ఇందిరానగర్లో జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న పట్టణ ప్రగతి ద్వారా ఇటు పట్టణాల్లో, అటు గ్రామాల్లో కూడా పారిశుధ్యం, పచ్చదనం వెల్లివిరుస్తుందన్నారు. ఇప్పటికే అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరుగుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ చిట్టిపోలు విజయలక్ష్మీశ్రీనివాస్, తహసీల్దార్ గుగులోతు దశరథనాయక్, ఎంపీడీఓ ఎ.బాలశంకర్, మున్సిపల్ కమిషనర్ ఎన్నం సుదర్శన్, మున్సిపల్ వైస్ చైర్మన్ బాత్క లింగస్వామి, కౌన్సిలర్లు పెద్దల చక్రపాణి, శేఖర్, ఎల్లేశ్ పాల్గొన్నారు.
పట్టణాల రూపురేఖలు మార్చేందుకే పట్టణ ప్రగతి
చౌటుప్పల్, జూలై 3 : పట్టణాల రూపురేఖలను పూర్తిగా మార్చేందుకే ప్రభుత్వం పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టిందని మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు అన్నారు. శనివారం ఆయన మున్సిపాలిటీ పరిధిలోని 3, 5, 19 వార్డుల్లో విద్యుత్ అధికారులతో కలిసి పర్యటించి విద్యుత్ సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో విద్యుత్ డీఈ మురళీధర్రెడ్డి, ఏఈ సురేందర్ నాయుడు, కమిషనర్ కోమటిరెడ్డి నర్సింహారెడ్డి, వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలంగౌడ్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ మొక్కల పెంపకం చేపట్టాలి
మోత్కూరు, జూలై 3 : పట్టణ ప్రగతిలో ప్రతిఒక్కరూ ఇంటింటా మొక్కలు నాటి పెంచాలని మోత్కూరు మున్సిపల్ చైర్పర్సన్ తీపిరెడ్డి సావిత్రీమేఘారెడ్డి కోరారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా శనివారం ఆమె మున్సిపాలిటీ పరిధి ఏడో వార్డులోని పద్మశాలీ కాలనీవాసులకు ఇంటింటా ఆరు రకాల మొక్కలను పంపిణీ చేశారు. మురుగు కాల్వలు, పిచ్చి మొక్కల తొలగింపు పనులను పరిశీలించారు. మున్సిపల్ కమిషనర్ షేక్ మహమూద్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తీపిరెడ్డి మేఘారెడ్డి, మేనేజర్ ప్రభాకర్, ఆర్ఐ సోమయ్య పాల్గొన్నారు.
పట్టణ ప్రగతితో ఆరోగ్య తెలంగాణ
ఆలేరు టౌన్, జూలై 3 : ఆలేరులో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా శిథిలావస్థకు చేరిన ట్రాన్స్ఫార్మర్ దిమ్మెలను శనివారం తొలగించి నూతనంగా నిర్మించిన దిమ్మెలపై వాటిని బిగించారు. ఈ సందర్భంగా ఆలేరు మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య మాట్లాడుతూ.. పట్టణ ప్రగతి కార్యక్రమంతో ఆరోగ్య తెలంగాణ సాధ్యమవుతుందన్నారు. అనంతరం పలుచోట్ల కంపచెట్లు, పిచ్చి మొక్కలను తొలగించారు. పారిశుధ్య పనులను చేపట్టారు. ఆయా కార్యక్రమాల్లో కమిషనర్ లావణ్యలత, కౌన్సిలర్లు బేతి రాములు, చింతలపని సునీత, దాసి నాగలక్ష్మి, కందుల శ్రీకాంత్, జూకంటి శ్రీకాంత్, రాయపురం నర్సింహులు, సునీత పాల్గొన్నారు.