కరీంనగర్ : సమస్త జీవకోటికి మొక్కలే ప్రాణాధారం అని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవి శంకర్
అన్నారు. బోయినపల్లి మండలం కొదురుపాక గ్రామంలో ఏడో విడత హరితహారం కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు జోగినపల్లి రవీందర్ రావుతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…ఆరు సంవత్సరాల క్రితం వర్షం కోసం ఆకాశం వైపు చూస్తూ ఉండేవాళ్లం. కానీ కేసీఆర్ సీఎం అయ్యాక హరితహారం కార్యక్రమం చేపట్టడంతో నేడు భూమి వైపు చూస్తున్నామని పేర్కొన్నారు. హరితహారం కార్యక్రమం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు.
పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా పల్లెలు, పట్టణాలు అందంగా మారుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ భూమిలో హరితవనాన్ని పెంచేలా చూడాలన్నారు. రాష్ట్రంలో 23శాతం ఉన్న అడవులను 33శాతానికి పెంచాలనే లక్ష్యంతో హరితహారం కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారన్నారు.