సేవారత్న నేషనల్ అవార్డుకు ఆర్ఎంపీ ఎంపిక

కృష్ణకాలనీ, ఫిబ్రవరి14: బహుజన సాహిత్య అకాడమీ సేవారత్న నేషనల్ అవార్డుకు భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని రాంనగర్కు చెందిన ఆర్ఎంపీ వంగ కుమారస్వామి ఎంపికయ్యారు. మార్చి 14న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతిలో నిర్వహించే సౌత్ ఇండియన్ బహుజన రైటర్స్ 4వ నేషనల్ కాన్ఫరెన్స్ సందర్భంగా కుమారస్వామికి అవార్డును అందించనున్నారు. ప్రదానోత్సవ కార్యక్రమానికి హాజరు కావాలని కోరుతూ బహుజన సాహిత్య అకాడమీ సేవారత్న నేషనల్ అవార్డు సెలక్షన్ కమిటీ జాతీయ అధ్యక్షడు నల్ల రాధాకృష్ణ ఆదివారం హైదరాబాద్లో కుమారస్వామికి ఆహ్వాన పత్రం అందజేశారు. జంగేడు పరిధిలోని వేశాలపల్లి, జంగేడు, రాంనగర్ ఫకీర్ గడ్డలో ఆర్ఎంపీ వైద్య సేవలు అందిస్తూ తనకు తోచిన రీతిలో సేవా కార్యక్రమాలు, వైద్య శిబిరాలు ఏర్పాటు, భూపాలపల్లి మండలంలో సీజనల్ వ్యాధుల నివారణకు చేసిన కృషికి అవార్డుకు ఎంపిక చేసినట్లు కమిటీ జాతీయ అధ్యక్షడు తెలిపారు.
తాజావార్తలు
- పారిశుద్ధ్యాన్ని పక్కాగా చేపట్టాలి : డా. యోగితా రాణా
- నియంత్రణ సంస్థ పరిధిలోకి డిజిటల్ న్యూస్!
- రాజ్నాథ్సింగ్ పంజరంలో పక్షి : రైతు నేత నరేశ్ తికాయత్
- మహేశ్బాబుకు పెద్ద చిక్కే వచ్చింది..అదేంటో తెలుసా..?
- భార్య టీ చేయకపోవడం.. భర్తను రెచ్చగొట్టి దాడికి ప్రేరేపించడం కాదు..
- చేనేతకు చేయూతనిద్దాం : మంత్రి నిరంజన్ రెడ్డి
- జీడీపీలో అసోం వాటా పెరిగేవరకూ అలసట లేని పోరు : అమిత్ షా
- నా మీటింగ్కు అనుమతి ఇవ్వడం లేదు..
- స్వల్ప వ్యవధిలోనే మూడు వికెట్లు కోల్పోయిన భారత్
- బెస్ట్ ఐటీ మినిస్టర్గా కేటీఆర్