హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): డ్రైవింగ్ వృత్తినే జీవనోపాధిగా కొనసాగిస్తున్న బ్రాహ్మణ యువకుడు మోత్కూరి సాయిశ్రవణ్కు బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ‘బెస్ట్’ స్కీం కింద షిఫ్ట్ డిజైర్ కారును మంజూరుచేసింది. గురువారం ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్ హైదరాబాద్ బేగంపేటలోని విప్ర ఫౌండేషన్ హెల్ప్ సెంటర్లో కారును ప్రారంభించారు. ఈ సందర్భంగా వాణీదేవి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ బ్రాహ్మణుల అభివృద్ధికి ఎంతగానో కృషిచేస్తున్నారని కొనియాడారు. వినయ్భాస్కర్ మాట్లాడుతూ.. బెస్ట్ స్కీం పేద, మధ్యతరగతి కుటుంబాలు స్వయం ఉపాధి పొందేందుకు ఎంతగానో తోడ్పడుతున్నదని పేర్కొన్నారు. విప్ర ఫౌండేషన్ చైర్మన్ వల్లూరి పవన్కుమార్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ బ్రాహ్మణుల పక్షపాతిగా చరిత్రలో నిలిచిపోతారని కొనియాడారు. కారు ధర రూ.6.70 లక్షలు కాగా, రూ.4.02 లక్షలు (60 శాతం) బ్రాహ్మణ పరిషత్ ద్వారా సబ్సిడీ లభించగా, మిగిలిన రూ.2.68 లక్షలు లబ్ధిదారుడు చెల్లించాలి.