Jayashankar
- Feb 13, 2021 , 02:20:00
VIDEOS
ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించండి

కాటారం, ఫిబ్రవరి 12: వరికి ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులు దృష్టిసారించాలని జిల్లా వ్యవసాయ అధికారి విజయ భాస్కర్ అన్నారు. శుక్రవారం విలాసాగర్లో రైతులకు వరికి బదులు ఇతర పంటల సాగు పద్ధతులు, లాభాలపై అవగాహన కల్పించారు. పొలం గట్లపై నీలగిరి మొక్కలు పెంచితే మంచి ఆదాయం వస్తుందని అన్నారు. వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు పాటిస్తే వ్యవసాయ రంగంలో మంచి లాభాలు సాధించవచ్చని అన్నారు. జిల్లా ఉద్యానవన అధికారి అక్బర్ మాట్లాడుతూ పందిరి తీగ జాతి కూరగాయలు సాగు చేయడం ద్వారా రైతులు సంవత్సరం పొడవునా ఆదాయం పొందవచ్చన్నారు. బంతి పూలు, ఆయిల్ఫాం సాగు విధానం వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్ రమాదేవి నర్సింగరావు, రైతుబంధు మండల కోఆర్డినేటర్ రాజబాపు, ఏవో రామకృష్ణ, ఉపసర్పంచ్ సంతోష్, ఏఈవో, రైతులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఏపీలో ఘోర ప్రమాదం : ముగ్గురు మృతి
- అఫీషియల్: ఎన్టీఆర్ హోస్ట్గా ఎవరు మీలో కోటీశ్వరులు
- శివరాత్రి ఉత్సవాలు.. మంత్రి ఐకే రెడ్డికి ఆహ్వానం
- బండి సంజయ్పై మంత్రి శ్రీనివాస్గౌడ్ ఫైర్
- 5 మిలియన్ ఫాలోవర్స్ దక్కించుకున్న యష్..!
- కాంగ్రెస్కు 25 సీట్లు కేటాయించిన డీఎంకే
- ప్రదీప్ హీరోయిన్ క్యూట్ పిక్స్ వైరల్
- దేశంలో కొత్తగా 18,711 పాజిటివ్ కేసులు
- హుజురాబాద్ శివారులో ప్రమాదం : ఒకరు మృతి
- మహేష్ బర్త్ డే రోజు సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్న మేకర్స్
MOST READ
TRENDING