అమృత్సర్ : కాంగ్రెస్ నేత నవజోత్ సింగ్ సిద్ధూపై శిరోమణి అకాలీదళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్ విమర్శలు గుప్పించారు. సిద్ధూని లక్ష్యం లేని మిసైల్గా బాదల్ బుధవారం అభివర్ణించారు. రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే వ్యక్తి పంజాబ్కు అవసరమని, నటించే నేతలతో ఉపయోగం లేదని వ్యాఖ్యానించారు.
అదుపులో లేని క్షిపణి వంటి వ్యక్తి సిద్ధూ అని అది తనతో సహా ఏ దిశగానైనా వెళ్లే ప్రమాదం ఉందని అన్నారు. ఇక బాదల్ వ్యాఖ్యలపై సిద్ధూ ఘాటుగా స్పందించారు. పంజాబ్ నుంచి అవినీతిని తుడిచిపెట్టేవరకూ తాను విశ్రమించనని అన్నారు. బాదల్ అవినీతి కార్యకలాపాలపై గురిపెట్టి పోరాడతానని సిద్ధూ పేర్కొన్నారు.