గ్రామాల అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలి

- ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
మొగుళ్లపల్లి, ఫిబ్రవరి 8 : గ్రామాల అభివృద్ధికి అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సూచించారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ యార సుజాతాసంజీవరెడ్డి అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ మిషన్ భగీరథ నీటిని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ప్రజలకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో మౌలిక సదుపాయాల కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తుండగా అధికారులు వాటిని అమలు చేయడంతో నిర్లక్ష్యం వహిస్తున్నారని, అలాంటి వారిపై చర్యలు తప్పవన్నారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ జోరుక సదయ్య, ఎంపీడీవో రామయ్య, సొసైటీ చైర్మన్ సంపెల్లి నర్సింగరావు, వైస్ ఎంపీపీ పోల్నేని రాజేశ్వర్రావు, కో ఆప్షన్ మెంబర్ రహీం, సర్పంచులు, ఎంపీటీసీలు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- చెన్నైలో ఈవీ చార్జింగ్ స్టేషన్.. టాటా పవర్+ఎంజీ మోటార్స్ జేవీ
- లీజు లేదా విక్రయానికి అంబాసిడర్ కంపెనీ!
- హార్టికల్చర్ విధాన రూపకల్పనకు సీఎం కేసీఆర్ ఆదేశం
- పల్లా గెలుపుతోనే సమస్యల పరిష్కారం : మంత్రి ఎర్రబెల్లి
- వీడియో: పాత్రలో లీనమై.. ప్రాణాలు తీయబోయాడు..
- మహారాష్ట్రలో మూడో రోజూ 8 వేలపైగా కరోనా కేసులు
- 2021లో విదేశీ విద్యాభ్యాసం అంత వీజీ కాదు.. ఎందుకంటే?!
- అజీర్ణం, గ్యాస్ సమస్యలను తగ్గించే చిట్కాలు..!
- నితిన్ వైపు పరుగెత్తుకొచ్చి కిందపడ్డ ప్రియావారియర్..వీడియో
- పార్వో వైరస్ కలకలం.. 8 కుక్కలు మరణం