అమరావతి,జూన్ 28: ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో పలుజిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం సడలింపులు ఇచ్చింది. కరోనా పాజిటివిటీ రేటు 5శాతం కంటే తక్కువ ఉన్నఎనిమిది జిల్లాలు అనంతపురం, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరంల్లో కర్ఫ్యూ ఆంక్షలు సడలింపు ఇస్తున్నట్లు ఏపీ సర్కారు ప్రకటించింది.
జూలై 1వ తేదీ నుంచి ఆయా జిల్లాల్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కార్యకలాపాలకు అనుమతులు ఇవ్వగా.. రాత్రి 9 గంటల నుంచి మరుసటి ఉదయం 6 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుందని స్పష్టం చేసింది. కరోనా పాజిటివిటీ రేట్ 5 శాతం కంటే ఎక్కువ ఉన్న పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, కృష్ణా, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న ఆంక్షలే కొనసాగుతాయని తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే కార్యకలాపాలకు అనుమతి ఉంటుందని అటు రాత్రి 6 గంటల తర్వాత నుంచి కర్ఫ్యూ కఠినంగా అమలు అవుతుందని సీఎం జగన్ స్పష్టం చేశారు.జూలై 1 నుంచి 7 వరకు ఈ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి.