ముంబై,జూన్ 21: ఈ రోజు స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. దీంతో సెన్సెక్స్ 249 పాయింట్లు, నిఫ్టీ 80 పాయింట్ల మేర నష్టపోయింది. బీఎస్ఈ 30 సూచీలో ఎన్టీపీసీ, హెచ్యూఎల్, సన్ ఫార్మా మినహా మిగతా స్టాక్స్ నష్టాల్లో ఉన్నాయి. ఆసియా మార్కెట్లు ఇవాళ అప్రమత్తంగా కదులుతున్నాయి. వీటితో పాటు దేశీయంగా వాహన, ఆటో వంటి కీలక రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తుతుండడంతో దేశీయ సూచీలు నష్టాల్లో ఉన్నాయి.