సిటీబ్యూరో, జూన్ 18(నమస్తే తెలంగాణ): ఆన్లైన్ క్లాస్లు వింటున్న బాలికకు అసభ్యకరమైన మెసేజ్లతో వేధిస్తున్న ఓ యువకుడిని రాచకొండ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. జోగులాంబ గద్వాల్ జిల్లా, ఐజా మండలానికి చెందిన బైరిపోగుల మోసయ్య లేబర్ పనిచేస్తూ.. ఉప్పల్లో నివాసముంటున్నాడు. అదే ప్రాంతానికి చెందిన బాలికకు గతంలో అసభ్యకరమైన మెసేజ్లు పెట్టడంతో అతడిని హెచ్చరించారు. ప్రస్తుతం కొవిడ్ వ్యాప్తి కారణంగా ఆన్లైన్ తరగతులు జరుగుతుండటంతో బాలికకు మోసయ్య అసభ్యకరమైన సందేశాలు పంపిస్తూ.. వేధిస్తున్నాడు. రాచకొండ సైబర్క్రైమ్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.