తగ్గుముఖం పట్టిన రెండో దశ కరోనా
సర్కారు దవాఖానల్లో ఆక్సిజన్ పడకలు సిద్ధం
మెదక్, జూన్ 13 : కరోనా రెండో దశ తీవ్రత నేపథ్యంలో మూడో దశ పిల్లలపై ప్రభావం అధికంగా ఉంటుందన్న హెచ్చరికలతో ఎదుర్కొకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి సంబంధించి అన్ని వసతులు కల్పించేందుకు సన్నద్ధమవుతున్నది. ఎక్కడ సమస్య తలెత్తకుండా చిన్నారుల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తోంది. మొదటి దశ కరోనా వృద్ధులు, రెండో దశలో వయసుతో సం బంధం లేకుండా వైరస్ బారినపడ్డారు. మూడో దశను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు.
రెండు ప్రభుత్వ దవాఖానల్లో 30 పడకలు…
మెదక్ పట్టణంలోని జిల్లా కేంద్ర దవాఖాన, నర్సాపూర్లో ఏరియా దవాఖాన , తూప్రాన్లో సీహెచ్సీలు ఉన్నాయి. ఇప్పటికే మెదక్లోని జిల్లా ప్రభుత్వ దవాఖాన, నర్సాపూర్లోని ఏరియా దవాఖాన, తూప్రాన్లోని సీహెచ్సీలో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు. మూడోదశ మొ దలైతే చిన్నారులకు చికిత్స అందించేందుకు జిల్లా దవాఖానలో 20 పడకలు, నర్సాపూర్ ఏరియా దవాఖానలో 10 పడకలను ఏర్పాటు చేయనున్నారు. జిల్లా కేంద్ర దవాఖానలో ఇప్పటికే పడకలను సిద్ధం చేసి ఆక్సిజన్ అందించేలా ఏర్పాట్లు చేశారు. రెండు దవాఖానల్లో ఇద్దరేసి పిల్లల డాక్టర్లు ఉన్నారు. చిన్నారులకు చికిత్సలు అందించే విధానం వేరుగా ఉంటుందని వైద్యులు అంటున్నారు. ఆక్సిజన్ మాస్క్లు చిన్నవిగా ఉంటాయని, రెమ్డిసివర్ వంటి ఇంజక్షన్లు ఇవ్వరాదని చెప్పుతున్నారు. వీటికనుగుణంగా అన్ని రకాల మందు లు ముందస్తుగానే సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తున్నది.
ఎక్కువ మందికి వ్యాక్సినేషన్..
మూడో దశ ప్రారంభం నాటికి వీలైనంత ఎక్కువ మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోం ది. ఇప్పటికే 45 ఏండ్లు దాటిన వారికి వ్యాక్సినేషన్ పూర్తి కావస్తుండగా, సూ పర్ స్ప్రెడర్లు, ఫ్రంట్లైన్ వారియర్స్ సైతం వ్యాక్సిన్ వేశారు. మెదక్ జిల్లా లో 0 నుంచి 5ఏండ్లలోపు వయస్సు గల చిన్నారులు 75,490 మంది ఉండగా, 6నుంచి 18సంవత్సరాల వారు 1, 24,121 మంది ఉన్నట్లు వైద్యాధికారులు గుర్తించారు. ఒక కుటుంబంలో ఒకరికి పాజిటివ్ వస్తే చిన్నారులకు వైరస్ వ్యాప్తి చెందుతుం ది. చిన్నారుల్లో జ్వరం, దగ్గు, జలు బు, ఆయాసం, డీ-హైడ్రేషన్, డయేరియా వంటి లక్షణాలుగా ఉంటున్నాయని వైద్యనిపుణులు చెబుతున్నా రు. చిన్నారుల విషయంలో తల్లిదండ్రుల పాత్ర ఎక్కువగా ఉంది. వారి విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
సమర్ధవంతంగా ఎదుర్కొంటాం..
మూడో దశను సమర్ధవంతం గా ఎదుర్కొనేందుకు అన్ని చర్య లు తీసుకుంటున్నాం. మూడో దశలో చిన్న పిల్లలు ఎక్కువగా వైరస్ బారిన పడే అవకాశం ఉం ది. ఇప్పటికే జిల్లా కేంద్ర దవాఖానలో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నాం. పిల్లల ఆరోగ్య విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు పాటించాలి.
డాక్టర్ వెంకటేశ్వర్రావు, డీఎంహెచ్వో, మెదక్
అప్రమత్తంగా ఉండాలి..
మూడో దశ పిల్లలపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. మూ డో దశ మొదలైతే చిన్నారులకు చికిత్సలు అందించేందుకు జిల్లా దవాఖానలో 20 పడకలు, నర్సాపూర్ ఏరియా దవాఖానలో 10 పడకలను ఏర్పాటు చేయనున్నారు. జిల్లా కేంద్ర దవాఖానలో ఇప్పటికే పడుకలను సిద్ధం చేసి ఆక్సిజన్ అందించేలా ఏర్పాట్లు చేశారు. రెండు దవాఖానల్లో ఇద్దరేసి చిన్నపిల్లల డాక్టర్లు ఉన్నారు.
డాక్టర్ పి.చంద్రశేఖర్,
జిల్లా దవాఖాన సూపరింటెండెంట్