బెంగళూరు, జూన్ 11: ప్రముఖ మొబైల్ విక్రయ సంస్థ సంగీతా మొబైల్స్..కరోనా సమయంలో తన ఉదారత చాటుకున్నది. తెలంగాణతోపాటు ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్ర్టాల్లోని అన్ని ప్రధాన నగరాల్లో సంగీతా మొబైల్స్ షోరూం వద్ద భోజన ప్యాకేట్లను పంపిణి చేసినట్లు కంపెనీ ఎండీ సుభాష్ చంద్ర వెల్లడించారు. కరోనాతో ఎన్నో కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, వీరికి తమవంతుగా సహాయం అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు.