న్యూఢిల్లీ: కరోనా నుంచి నివారణకు వ్యాక్సిన్లు వేయించుకునేందుకు ప్రజలకు ప్రముఖ టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో అద్భుతమైన ఫీచర్ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. జియో యూజర్లు వాట్సాప్ చాట్బాట్ ద్వారా తమ ప్రాంత పిన్ కోడ్ నమోదు చేస్తే.. ఆయా ఏరియాలో వ్యాక్సినేషన్ కేంద్రాల సమాచారం తెలుసుకోవచ్చు. ఇంకా రీఛార్జ్, పేమెంట్లు తదితర కస్టమర్ సర్వీసులనూ ఈ చాట్బాట్ ద్వారా అందిస్తున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.
‘ఇకపై మా ఖాతాదారులు ఫోన్ రీఛార్జ్లు, చెల్లింపులు, మొబైల్ పోర్టబిలిటీ, ఇంటర్నేషనల్ రోమింగ్, జియోమార్ట్ వంటి సేవలను వాట్సాప్ ద్వారా పొందొచ్చు. దీంతో పాటు కొవిడ్ వ్యాక్సిన్, టీకా లభ్యత సమాచారమూ తెలుసుకోవచ్చు’ అని జియో వర్గాలు తెలిపాయి.
ఇందుకోసం యూజర్లు జియో కేర్ నంబర్ను +91 70007 70007ను వాట్సాప్లో సేవ్ చేసుకుని దానికి Hi అని మెసేజ్ పంపితే చాలు.. ఈ చాట్బాట్ సేవలు అందుబాటులోకి వస్తాయని కంపెనీ తెలిపింది.
హాయ్ అని పంపించాక యూజర్లకు సేవల మెనూ కన్పిస్తుంది. అందులో కొవిడ్ వ్యాక్సిన్ సమాచారం, జియో సిమ్ రీఛార్జ్, పోర్టబిలిటీ వంటి తదితర ఆప్షన్లు ఉన్నాయి. మనకు అవసరమైన ఆప్షన్ ఎంచుకుంటే దాని వివరాలు అందుబాటులోకి వస్తాయి.