అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలి

కాటారం : పల్లెప్రగతిలో భాగంగా గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా ఉద్యాన అధికారి, మండల ప్రత్యేక అధికారి అక్బర్ సూచించారు. మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డు, శ్మశాన వాటిక, సెగ్రిగేషన్షెడ్డు తదితర అభివృద్ధి పనుల పురోగతిపై చర్చించారు. పనుల్లో మరింత స్పీడ్ పెంచేందుకే అధికారులతో సమావేశమైనట్లు తెలిపారు. జీపీల్లో ఉపాధి హామీ పనులను ప్రారంభించాలని, 50 మంది కూలీలకంటే తక్కువ తగ్గకుండా ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించాలన్నారు. అలాగే ప్రతి శుక్రవారం అవెన్యూ ప్లాంటేషన్ కింద నాటిన మొక్కలకు వాటర్ ట్యాంకర్ ద్వారా నీరు పట్టాలని ఆదేశించారు. సమావేశంలో ఎంపీడీవో శంకర్, ఎంపీవో మల్లికార్జున్ రెడ్డి, ఏపీవో వెంకన్న, పంచాయతీ ప్రత్యేక అధికారులు, కార్యదర్శులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ప్రచార పర్వం : టీ కార్మికులతో ప్రియాంక జుమర్ డ్యాన్స్
- సంత్ సేవాలాల్ మహరాజ్ నిజమైన సేవకుడు
- నాంది హిందీ రీమేక్..హీరో ఎవరంటే..?
- పాఠశాలలో మరిన్ని వసతులు కల్పిస్తాం : మంత్రి కొప్పుల
- మళ్లీ పెరిగిన పసిడి ధర
- వ్యాక్సిన్తోనే మహమ్మారికి అడ్డుకట్ట : ఎయిమ్స్ చీఫ్
- 200 పరుగుల తేడాతో గెలిచిన ముంబై
- విడాకులపై నోరు విప్పిన అమలాపాల్
- నైట్ కర్ఫ్యూ.. బార్లు, రెస్టారెంట్లకు ఊరట
- పాడుతున్న పులి.. ఆశ్చర్యపోతున్న జూ సందర్శకులు