గీసుగొండ/పర్వతగిరి/నెక్కొండ/చెన్నారావుపేట/శాయంపేట/సంగెం, జూన్ 5: జిల్లాలోని పలు బాధిత కుటుంబాలకు శనివారం దాతలు సాయం అందించారు. గీసుగొండ మండలం కొనాయిమాకులకు చెందిన వజ్ర నీలాబాయి అనారోగ్యంతో బాధపడుతుండగా, ఆపద్బాంధవుల ఫౌండేషన్ ఆధ్వర్యంలో 25 కిలోల బియ్యం, సరుకులు అందించారు. ఉపాధ్యాయుడు కర్ణకంటి రామ్మూర్తి, టీఆర్ఎస్ నాయకులు ప్రమోద్, శ్రీకాంత్, అజారుద్దీన్, సుకూర్ పాల్గొన్నారు. పర్వతగిరి మండలంలోని కల్లెడ జీపీ సిబ్బందికి వైస్ ఎంపీపీ ఎర్రబెల్లి రాజేశ్వర్, సర్పంచ్ సంపెల్లి శోభ పరమేశ్వర్రావు 10 కేజీల బియ్యం, 11 రకాల నిత్యావసరాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో చీనురి సోమయ్య, వార్డు సభ్యులు చిరుత రాజు, వెంకన్న, కార్యదర్శి మాధవుడు పాల్గొన్నారు. అలాగే, పర్వతగిరిలో ఇటీవల మృతి చెందిన ఊరుగొండ తిరుపతి కుటుంబానికి బాల్యమిత్రులు రూ. 8 వేల ఆర్థిక సాయం అందించారు.
రవీందర్, సాంబయ్య, మహేందర్రెడ్డి, ప్రేమ్కుమార్, హఫీజ్, ఇబ్రహీం పాల్గొన్నారు. నెక్కొండ మండలం పెద్దకోర్పోలుకు చెందిన బీజేపీ నాయకుడు బొడ్డుపెల్లి వెంకటేశ్వర్లు మృతి చెందగా, బాధిత కుటుంబానికి పార్టీ రాష్ట్ర నాయకుడు ఎర్రబెల్లి మదన్మోహన్రావు క్వింటాల్ బియ్యం అందించారు. చెన్నారావుపేటలో బీజేపీ ఆధ్వర్యంలో గ్రామస్తులకు మాస్కులు పంపిణీ చేశారు. సంతోష్కుమార్, నరేందర్, భద్రయ్య, తిరుపతిరెడ్డి, విజేందర్, వీరేంద్రనాథ్ పాల్గొన్నారు. శాయంపేటలో బహుజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కరోనా బాధితులు, నిరుపేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు మారెపల్లి క్రాంతికుమార్, ప్రధాన కార్యదర్శి మొగ్గం సుమన్, మండల అధ్యక్షుడు పెంబర్తి సుమన్, జయశంకర్ జిల్లా ఇన్చార్జి బొమ్మకంటి ఉదయ్, నాయకులు దైనంపెల్లి శివ, వేణు పాల్గొన్నారు.
తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు సాయం
సంగెం/రాయపరి: మండలంలోని తిమ్మాపురంలో ఇటీవల కరోనాతో తల్లితండ్రులను కోల్పోయిన పిల్లలకు కలెక్టర్ ఆదేశాలతో బాలల సంరక్షణ అధికారులు రూ. వెయ్యి ఆర్థిక సాయంతోపాటు నిత్యావసరాలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా బాలల సంరక్షణాధికారి డీ రాజు, ఎంపీడీవో ఎన్ మల్లేశం, ఐసీడీఎస్ సూపర్వైజర్ ఉమాదేవి, సోషల్ వర్కర్ జే పద్మలత, ఎంపీపీ కందకట్ల కళావతి, వైస్ ఎంపీపీ బుక్క మల్లయ్య, సర్పంచ్ గన్ను శారద-సంపత్, నరహరి, కార్యదర్శి శ్రావణి, అంగన్వాడీ టీచర్ అరుణ పాల్గొన్నారు. రాయపర్తి మండలం కొండూరుకు చెంది న టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గోనెల యాదగిరి కుమారుడు రాజు ఇటీవల మృతి చెందగా, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి పూస మధు, పంతంగి నర్సయ్య బాధిత కుటుంబాన్ని పరామర్శించి 50 కేజీల బియ్యం అందించారు.