బెంగళూరు: కర్ణాటకలో మరోసారి లాక్డౌన్ పొడిగించారు. ఈనెల 14 వరకూ లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప గురువారం ప్రకటించారు. రాష్ట్రంలోని కరోనా పరిస్థితిపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. కరోనా వ్యాప్తి కట్టడి కోసం లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఉన్న లాక్డౌన్ నిబంధనలే కొనసాగుతాయి.