వరంగల్ రూరల్ : జిల్లాలోని నర్సంపేట మండలం రాములునాయక్తండా గ్రామపంచాయతీ పరిధిలోని స్వామినాయక్తండాకు చెందిన 92 ఏండ్ల ఓ బామ్మ కరోనాను జయించింది. వివరాలు ఇలా ఉన్నాయి. తండాకు చెందిన అజ్మీరా బాలమ్మ ఈ నెల 12న కొవిడ్ పరీక్ష చేయించుకోగా కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో స్థానిక వైద్యులు ప్రభుత్వం అందించే ఉచిత మందుల కిట్ను ఆమెకు అందించారు.
బాలమ్మ ఇంట్లోనే సమయానికి మందులు వేసుకుంటూ పౌష్టికాహారాన్ని తీసుకుంది.
ఈ క్రమంలో ఈ నెల 30న కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా నెగెటివ్ వచ్చింది. కరోనా వైరస్ నుంచి బాలమ్మ విముక్తి పొందడంతో ఆమెతోపాటు కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
కూతురు పుట్టిందని ఊరంతా కూరగాయల పంపిణీ
ఘనంగా హేమాచల లక్ష్మీ నర్సింహస్వామి నాగవెల్లి
పోలీసుల పేరుతో దోపిడీకి పాల్పడిన దొంగ అరెస్ట్
మహబూబాబాద్ ఘటనపై మంత్రి ఎర్రబెల్లి సీరియస్
కరోనా బాధితులను ప్రజా ప్రతినిధులు ఆదుకోవాలి