కాకతీయుల కాలం నాటి పురాతన దేవాలయం
ఆలయాన్ని సందర్శించిన చరిత్ర అన్వేషకుడు హరగోపాల్
వెలుగులోకి కొత్త విషయాలు
రాజాపేట, మే 27: మండలంలోని కుర్రారం శివారులోని శివాలయం కాలముఖుల ఆరాధన క్షేత్రమని చరిత్ర అన్వే షకుడు శ్రీరామోజు హరగోపాల్ అన్నారు.గురువారం కు ర్రారం గ్రామంలోని పురాతన శివాలయాన్ని ఆయన సంద ర్శించారు. ఈ సందర్భంగా కోటగుళ్లల్లోని శిల్పకళా విన్యా సం ఇక్కడి శివాలయంలో కూడా కనిపిస్తున్నాయని తెలిపా రు. చాళుక్యుల కాలం నాటి దేవాలయ వాస్తు నిర్మాణాలు కాకతీయుల చేత కొనసాగించబడ్డాయన్నారు. కుర్రారం శివాలయం త్రికూట రూపం శిథిలం కావడంతో కొంత భా గం వ్యస్థమైపోయిందని, ఆలయ గోడలు ఇంటర్ లాకింగ్ పద్ధతిలో ఇటుకల వంటి పెద్ద రాతి బిల్లలతో నిర్మాణం చే పట్టారన్నారు. మండపంలోని స్తంభాలు కాకతీయ శైలివని, అంతరాళ ద్వారం శోభాయమానమైన శిల్పాలతో అలం కృతమై ఉందన్నారు.
ద్వారానికి లలాటబింబంగా గజలక్ష్మి తో పాటు ద్వారా ఇరువైపులా శైవద్వార పాలకులు ఇద్దరి ద్దరి పరివారంతో ఉన్నాయన్నారు. గర్భగుడి లోపల ద్వారా నికి కలశాలు చెక్కి ఉన్నాయని, కోటగుళ్ల తరహాలోనే ఆల య ద్వారాల గడపల మీద షోడశ దళపుష్పం చెక్కి ఉంద న్నారు. గడప ముందు శైవమూర్తుల శిల్పాలునాయని, అం దులో ఒకటి కీర్తిముఖ తోరణమున్న కోష్టంలో కుడిభుజం మీద లగుడంతో, ఎడమ చేత పుష్పంతో ఉత్కుటాసనంలో కూర్చొని ఉన్న శైవమూర్తి లకులీశునివలే ఉన్నాడన్నారు. అతడికి ఇరువైపులా ఇద్దరు లగుడధారులైన కాలముఖులు న్నారని, ఇంకొక గడపకు లకలీశుడే చెక్కబడి ఉండడంతో పాటు మరో గడపకు వీణ ధరించిన స్త్రీమూర్తి ఉందన్నారు. ఆమె పైన కీర్తిముఖం చెక్కి ఉన్న శిల్పాల ఆధారంతో దేవా లయం కాలముఖుల ఆరాధన క్షేత్రమని చెప్తున్నాయి. గర్భ గుడిలో చాళుక్య శైలిలో గుండ్రని పానపట్టంలో అమర్చిన సమతల లింగం ప్రతిష్ఠించబడి ఉందన్నారు. మండపం అంతరాళంలో గర్భగుడుల కప్పుల్లో చెక్కిన పుష్పగర్భ శిల్పాలు అద్భుతంగా ఉన్నాయన్నారు. ఆలయం ముందు భాగాన రామప్ప వేయి స్తంభాల గుడుల పద్ధతిలో నందికి ప్రత్యేక మండపం ఉంది. చక్కటి అధిష్టాన పీఠం మీద కుడి వైపు తల తిప్పి చూస్తున్నట్టు, లేవడానికి ఉద్యుక్తమైనట్టు కూర్చొని ఉన్న నంది శిల్పం సర్వాలంకార శోభితమై రామ ప్ప నంది పోలిక ఉందన్నారు. నాగశిల్పం కూడా ఆలయ ప్రాంగణంలో దర్శనమిస్తున్నదన్నారు. ఆ కాలంలో నీళ్లు తోడడానికి వాడిన రాతి రాటణస్తంభం కన్పిస్తుందన్నారు.