భోపాల్ : మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పీపీఈ కిట్ల కుంభకోణం జరిగినట్లు తెలుస్తున్నది. వాడిన పీపీఈ కిట్లను నాశనం చేయకుండా బయో వేస్ట్ ప్లాంట్ వేడి నీటిలో శుభ్రం చేసి విక్రయిస్తున్నట్లుగా పరిశోధనలో తేలింది. సత్నా-భోపాల్ బహిరంగ మార్కెట్లో విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
మధ్యప్రదేశ్లోని సత్నా జిల్లాలో వైరస్ వ్యాప్తిని ఆసరాగా మార్చుకుని భయంకర వ్యాపారానికి తెరలేపిన ఇబ్బందికర వీడియో ఒక సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సత్నాలోని బాద్ఖేరా బయో వేస్ట్ డిస్పోజల్ ప్లాంట్లో సింగిల్ యూజ్ పీపీఈ కిట్లను వేడి నీటిలో శుభ్రం చేసి, పలు ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం, పీపీఈ కిట్లను శాస్త్రీయంగా నాశనం చేయడానికి బాద్ఖెరాలోని ఇండో వాటర్ బయో వేస్ట్ డిస్పోజల్ ప్లాంట్కు పంపుతారు. అయితే ఇక్కడ వాటిని నాశనం చేయకుండా శుభ్రపరిచి కొత్త వాటిలాగా సిద్ధం చేస్తున్నారు. కట్టలుగా కట్టి బహిరంగ మార్కెట్లో విక్రయానికి పంపుతున్నట్లు తేలింది. పీపీఈ కిట్లతో పాటు మాస్క్లు, హ్యాండ్ గ్లోజ్లు కూడా ఇదే మాదిరిగా శుభ్రం చేసి మళ్లీ మార్కెట్కు పంపుతున్నట్లు సీక్రెట్ పరిశోధనలో తేలింది. ఈ వీడియో వైరల్ అయిన తర్వాత జిల్లా యంత్రాంగం బయో వేస్ట్ డిస్పోజల్ ప్లాంట్ యాజమాన్యంపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం.. పీపీఈ కిట్లు, హ్యాండ్ గ్లోజులు, మాస్క్లు ఒక్కసారి మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. అలాగే, వాటిని బహిరంగ ప్రదేశంలో విసిరేయకూడదు. కానీ, శాస్త్రీయ పద్ధతిలో బయో వ్యర్థాలను పారవేసే కర్మాగారంలో నాశనం చేయాలి.
ఇక ఎవరి ఆస్తికి నష్టం కలిగించినా భర్తీ చేయాల్సిందే..!
సముద్రంలో అరుదైన ఖనిజాలను కనుగొన్న జపాన్
7 ఏండ్లలో మోదీ 7 నిర్ణయాలు.. ప్రతి భారతీయుడిపై ప్రభావం
భారత ప్రధానిగా మోదీ ప్రమాణం.. చరిత్రలో ఈరోజు
అరటితో ఏమేం పోషకాలు అందుతాయంటే..?
విరాట్ సేనకు వెటరన్ క్రికెటర్ రిచర్డ్ హాడ్లీ ప్రశంసలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..