Jayashankar
- Nov 29, 2020 , 02:58:35
VIDEOS
విధులకు క్రమం తప్పకుండా హాజరుకావాలి

- భూపాలపల్లి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్
కృష్ణకాలనీ: భూపాలపల్లి మున్సిపల్ పరిధిలో పని చేస్తున్న పారిశుధ్య కార్మికులు ప్రతి రోజు క్రమం తప్పకుండా విధులకు హాజరుకావాలని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ అన్నారు. శనివారం తెల్లవారుజామున జిల్లా కేంద్రంలో పారిశుధ్య పనులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రతి రోజు ఎంతమంది కార్మికులు వస్తున్నారో తెలుసుకుని హాజరు పట్టికను పరిశీలించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ
భూపాలపల్లి పట్టణం పచ్చదనంతో, పరిశుభ్రంగా ఉండాలంటే పారిశుధ్య కార్మికులతోనే సాధ్యమవుతుందన్నారు. ప్రతి వీధిలో మురికి కాలువలను శుభ్రం చేస్తూ, రోడ్లపై చెత్త చెదారాన్ని ఎప్పటికప్పుడు తీసివేయాలన్నారు. ఏమైన సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని, ఎలాంటి అనారోగ్యాలకు గురి కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కమిషనర్ వెంట మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.
తాజావార్తలు
- కొట్లాటల కాంగ్రెస్ పట్టభద్రులకేం చేస్తుంది..
- కళ్లెదుటే అభివృద్ధి
- నేటి నుంచి చీదెళ్ల జాతర
- ఆ ఊరు.. ఓ ఉద్యానం
- సంత్ సేవాలాల్ త్యాగం చిరస్మరణీయం
- పెట్రో భారం తగ్గించాలంటే ఇలా చేయాల్సిందే: ఆర్బీఐ
- అరకొర పనులు..
- పకడ్బందీగా పట్టభద్రుల ఎన్నికలు
- విదేశీ నిపుణులకు అమెరికా వీసాపై బ్యాన్ విత్డ్రా
- అలాంటి పేరు తెచ్చుకుంటే చాలు!
MOST READ
TRENDING