చెక్పోస్టుల వద్ద పకడ్బందీగా పోలీసుల తనిఖీలు
అనవసరంగా బయట తిరిగేవారిపై చట్టపరమైన చర్యలు
వాహనాలు సీజ్.. కేసులు నమోదు
రంగారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు 213 వాహనాలు సీజ్
5,228 లాక్డౌన్ ఉల్లంఘన కేసులు నమోదు
వికారాబాద్ జిల్లాలో 4,582 కేసులు నమోదు
1,163 వాహనాలు సీజ్.. రూ.39.40 లక్షలు జరిమానా
కరోనా కట్టడికి ఉమ్మడి జిల్లా యంత్రాంగం లాక్డౌన్ను మరింత కఠినంగా అమలు చేస్తున్నది. పోలీసులు ప్రత్యేకంగా చెక్పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. అత్యవసర సర్వీసులు, ఈ-పాస్లు పొందినవారికి మాత్రమే అనుమతిస్తున్నారు. అనవసరంగా బయటకు వచ్చినవారి వాహనాలను సీజ్ చేయంతో పాటు నిబంధనలను ఉల్లంఘించినవారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటివరకు రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 213 వాహనాలను సీజ్ చేశారు. 5,228 లాక్డౌన్ నిబంధనల ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. వికారాబాద్ జిల్లాలో 4,582 కేసులు నమోదుకాగా, 1,163 వాహనాలను సీజ్ చేశారు. అదేవిధంగా నిబంధనలు పాటించనివారికి రూ.39.40 లక్షల జరిమానా విధించారు.
రంగారెడ్డి, మే 22, (నమస్తే తెలంగాణ): జిల్లాలో లాక్డౌన్ అమలు మరింత కఠినతరం చేశారు. లాక్డౌన్ సమయంలో అనవసరంగా బయటకు వచ్చే వారిపై చర్యలు తీసుకుంటున్నారు. ఇంట్లో నుంచి ఏ ఒక్కరూ రోడ్డుపైకి రాకుండా పోలీసులు కట్టడి చేస్తున్నారు. లాక్డౌన్ సమయంలో అత్యవసర సర్వీసులతో పాటు ఈ-పాస్లు పొందిన వారిని మాత్రమే రోడ్డుపైకి అనుమతిస్తున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో లాక్డౌన్ మరింత కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. లాక్డౌన్ సమయంలో అనవసరంగా బయటకు వచ్చే వారి వాహనాలను సీజ్ చేసి ఆయా పోలీస్స్టేషన్లకు తరలిస్తున్నారు. ఉదయం 10 గంటల తరువాత ప్రజారవాణాతోపాటు వ్యాపార, మద్యం దుకాణాలు, ప్రైవేట్ వాహనాలు పూర్తిగా బంద్ చేస్తున్నారు. లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చిన వారికి పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటివరకు 213 వాహనాలను సీజ్ చేశారు. ఇబ్రహీంపట్నం డివిజన్లో 140 వాహనాలు, చేవెళ్లలో 26 వాహనాలు, ఆమనగల్లు సర్కిల్ పరిధిలో 16, షాద్నగర్ పరిధిలో 31 వాహనాలను సీజ్ చేశారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. జిల్లాలోని ఆమనగల్లు పరిధిలో 890 కేసులు, ఇబ్రహీంపట్నంలో 1,910, చేవెళ్ల పరిధిలో 1,398, షాద్నగర్ పరిధిలో 1,030 ఉల్లంఘన కేసులు నమోదు చేశారు. జిల్లావ్యాప్తంగా చెక్పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో సర్పంచులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పోలీసులకు సహకరిస్తున్నారు. సడలింపు సమయంలో మార్కెట్లు, దుకాణాల వద్ద ప్రజలు గుంపులుగా ఉండకుండా మార్కెట్లు, దుకాణాల వద్ద అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. షాపుల ఎదుట భౌతికదూరం పాటించే విధంగా డబ్బాలు గీసి నిబంధనలు పాటించేలా చూస్తున్నారు.
వికారాబాద్ జిల్లాలో 4582 కేసులు..
పరిగి, మే 22 : ప్రభుత్వం లాక్డౌన్ విధించినా కొంతమంది అనవసరంగా రోడ్లపైకి వస్తున్నారు. దీంతో నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయాలని డీజీపీ మహేందర్రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా జిల్లా అధికారులు లాక్డౌన్ను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఎస్పీ నారాయణ ఆదేశాలతో పోలీసులు క్షేత్ర స్థాయిలో వాహనదారులను ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. ప్రధాన రోడ్లపై వాహనాలను సీజ్ చేయడంతో పాటు పట్టణాల్లోని వీధుల్లో డ్రోన్ కెమెరాల ద్వారా లాక్డౌన్ పర్యవేక్షిస్తున్నారు. కాలనీల్లో గుంపులుగా తిరుగుతుంటే గుర్తించి కేసులు నమోదు చేస్తున్నారు. సాయంత్రం వాకింగ్ చేసినా, వాలీబాల్ తదితర ఆటలు ఆడినా డ్రోన్ కెమెరాతో పర్యవేక్షించి చర్యలు తీసుకుంటున్నారు. దీంతో డ్రోన్ కెమెరా కంటిలో పడితే కేసు తప్పదని జనం ఇండ్లకే పరిమితమవుతున్నారు.
4,582 కేసులు.. 1,163 వాహనాలు సీజ్
ఈ నెల 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘినవారిపై మొత్తం 4,582 కేసులు నమోదు చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కు ధరించకపోవడం, భౌతికదూరం పాటించకపోవడం, గుంపులుగా ఉండడం తదితర అంశాలకు సంబంధించి కేసులు నమోదు చేశారు. మొత్తం 177 ఎఫ్ఐఆర్లు నమోదవగా, 667 ఈ-పీటీ కేసులు, 3,738 ఈ-చలాన్ కేసులు నమోదు చేసి రూ.39.40లక్షల జరిమానా విధించారు. దీంతోపాటు 1,163 వాహనాలను సీజ్ చేశారు.
సడలింపు లోనూ
ప్రత్యేక చర్యలు..
లాక్డౌన్ సడలింపు సమయంలోనూ ఇబ్బందులు రాకుండా పోలీస్ అధికారులు, స్థానిక సంస్థల అధికారులతో కలిసి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా పట్టణాల్లో కూరగాయల విక్రయాలు, ఇతర నిత్యావసర వస్తువుల విక్రయాల దగ్గర జనం రద్దీగా ఉండడంతో భౌతిక దూరం పాటిస్తూ క్రయవిక్రయాలు జరిగేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కూరగాయల దుకాణాల మధ్య దూరం ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టర్ పౌసుమి బసు స్వయంగా పర్యటిస్తూ నిబంధనలు ఉల్లంఘనలు జరుగకుండా అవసరమైన చర్యలు చేపడుతున్నారు. తాండూరు, వికారాబాద్, పరిగి, కొడంగల్ పట్టణాల్లో కూరగాయల మార్కెట్లు కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేసి సడలింపు సమయంలో కొనుగోళ్లు జరిగేలా స్థానిక అధికారులు చొరవ తీసుకుంటున్నారు.
అనవసరంగా రోడ్లపైకి రావొద్దు..
లాక్డౌన్ సమయంలో ప్రజలు అనవసరంగా రోడ్లపైకి రావొద్దు. అత్యవసరమైన పనులకు మాత్రమే ఈ-పాస్కు దరఖాస్తు చేసుకోవాలి. దుకాణాలను ఉదయం 10 గంటలలోపే మూసివేయాలి. అత్యవసరం కాని విభాగాల్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు ప్రతిరోజు ఉదయం 10 గంటల వరకు కార్యాలయాలకు చేరుకొని లాక్డౌన్కు సహకరించాలి. లాక్డౌన్ సమయంలో అత్యవసరమైన ఆరోగ్య సమస్యలకు మాత్రమే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాహనాలను అనుమతించబడును.
-ఎం.నారాయణ, ఎస్పీ, వికారాబాద్ జిల్లా
పదిదాటాక రోడ్లపైకి రావొద్దు
నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు : ఏసీపీ కుశల్కర్
షాద్నగర్టౌన్ మే 22: లాక్డౌన్ సడలింపు సమయం లోనే పనులు ముగించుకోవాలని, పది దాటాక రోడ్లపైకి ఎవరూ రావొద్దని షాద్నగర్ ఏసీపీ కుశల్కర్ సూచిం చారు. షాద్నగర్ పట్టణ ముఖ్యకూడలిలోని పోలీస్ చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలను శనివారం సీఐ నవీన్ కుమార్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ ఉదయం 6గంటల నుం చి 10గంట లలోపే పనులను ముగించుకుని ఇంటికే పరిమితం కావాలన్నారు. అత్యవసరం ఉంటే తప్ప అనవసరంగా రోడ్లపైకి వస్తే వాహనాలను సీజ్ చేయడంతో పాటు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. లాక్డౌన్ సమ యంలో రోడ్లపైకి వచ్చేవారు తగిన ఆధారాలను తప్ప కుండా చూయించాలని, లాక్డౌన్ నిబంధనలను ఉలం ఘిస్తే చర్యలు తప్పవన్నారు. లాక్డౌన్ను పకడ్బందీగా అమలు చేయాలని, నిబంధనలను ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చే వాహనాలను సీజ్ చేయాలని సూచించారు.
ఆమనగల్లులో…
ఆమనగల్లు, మే 22 : ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, భౌతికదూరం పాటిస్తేనే కరోనాలింక్ తెగు తుందని సీఐ ఉపేందర్ అన్నారు. నిబం ధనలు ఉల్లం ఘిస్తూ రోడ్ల పైకి వస్తున్నా రని అలాంటి వారిపై కేసులు నమోదు చేసి, వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చ రించారు. శని వారం హైదరాబాద్-శ్రీశై లం ప్రధాన రహదారిపై ఎస్సై ధర్మేశ్, సి బ్బం దితో కలిసి వాహనాల తనిఖీ చేప ట్టారు. ప్రజలు పోలీసులకు సహకరించా లని కోరారు.
యాచారంలో…
యాచారం, మే 22 : లాక్డౌన్ సమ యం లో రోడ్లపైకి వచ్చిన వాహన దా రులపై శనివారం పోలీసులు కఠి నంగా వ్యవహరించారు.. యా చారం, మాల్ చెక్పోస్టుల వద్ద సీఐ లింగ య్య, ఎస్ఐ ప్రభాకర్ ముమ్మ రంగా వాహనాలను తని ఖీ చేశారు. పాసులున్న ఉన్న వా హన దారులను వదిలేసి ఇత రు ల బైకులు, కార్లు, ఆటోలు సీజ్ చేశారు. వాహనదారులు అనవస రంగా రోడ్లపైకి రావొద్దని, ప్రజలు గ్రా మాల్లో గుంపులుగా ఉండ వద్దని సీఐ సూచించారు. నిబం ధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
మొయినాబాద్లో..
మొయినాబాద్, మే22: రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ను పోలీసులు పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు సడ లిం పు ఇచ్చిన నేపథ్యంలో దుకాణాలు, వ్యాపార సమూ దాయాలు తెరచి వ్యాపారం చేసుకుంటున్నారు. ఎవ రైనా దుకాణాలను మూసి వేయకుండా తెరచి ఉంచితే పోలీసులు వెంటనే మూసి వేయిస్తున్నారు. అనవసరం గా వాహనాలు తీసుకుని రోడ్ల మీదకి వచ్చిన వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఎలాంటి కారణం లేకుండా వచ్చినా, కారణం ఉండి మూతికి మాస్కు లేకుండా వచ్చినా వారికి జరిమానా విధిస్తున్నా రు. హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై మొ యినాబాద్ మండల కేంద్రంతో పాటు అజీజ్నగర్ పాత గేట్ వద్ద చెక్పోస్టులు ఏర్పాటు చేసి పకడ్బందీగా లాక్ డౌన్ను అమలు చేస్తున్నారు. ఇన్స్పెక్టర్ రాజు బందో బస్తు నిర్వహణను పర్యవేక్షిస్తున్నారు.