ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయండి
సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి
ఇబ్రహీంపట్నం, మే 22: నెలరోజుల పాటు నియోజకవర్గంలో మిషన్భగీరథ నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనున్నందున ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం ఇబ్రహీం పట్నం క్యాంపు కార్యాలయంలో తాగునీటి సరఫరాపై వాటర్గ్రిడ్, గ్రామీణ నీటి సరఫరా విభాగం, మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గతేడాది వేటర్ ఇంటల్వాల్ మునగ డంతో పంపులు చెడిపోయి పంపిణీలో ఇబ్బందులు తలెత్తిన విష యాన్ని ఎమ్మెల్యే గుర్తుచేశారు. ఆ పంపును పునరుద్ధరించడానికి నెల రోజుల పాటు భగీరథ నీటి పంపిణీ నిలిచిపోనున్నదని ఈఈలు నర్సింహులుగౌడ్, రాజేశ్వర్ ఎమ్మెల్యేకు తెలిపారు. ఈ నెల 25 నుం చి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదే శించారు. గున్గల్ రిజర్వాయర్ నుంచి కృష్ణా నీటి సరఫరాకు ఏర్పా ట్లు చేయాలన్నారు. విద్యుత్శాఖ డీఈ యాదగిరితో ఎమ్మెల్యే ఫోన్లో మాట్లాడి గున్గల్ రిజర్వాయర్ వద్ద విద్యుత్ సరఫరాలో అంతరా యం లేకుండా చూడాలన్నారు. గ్రామాలు, మున్సిపాలిటీలకు రోజు విడిచి రోజు కృష్ణా జలాలు పంపిణీ చేసేలా చర్యలు చేప ట్టాలన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రమణారెడ్డి, మున్సి పల్ కమిషనర్లు షఫీయుల్లా, జయంత్కుమార్రెడ్డి, సరస్వతి, వాటర్ గ్రిడ్ డీఈ ప్రియాంక, ఆర్డబ్ల్యూఎస్ డీఈ రాజు, మున్సిపల్ డీఈలు గోపీనాథ్, యాదయ్య, అనిరుద్రారెడ్డి పాల్గొన్నారు.