వాట్సాప్కు కేంద్రం నోటీసులు
న్యూఢిల్లీ: వాట్సాప్ ఇటీవల తీసుకువచ్చిన వివాదాస్పద గోప్యతా విధానాన్ని (ప్రైవసీ పాలసీని) వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్రప్రభుత్వం ఆదేశించినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు కేంద్ర ఐటీశాఖ వాట్సాప్కు నోటీసులు పంపించినట్టు పేర్కొన్నాయి. వారంలోగా స్పందించాలని లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకొంటామని ఐటీశాఖ అందులో పేర్కొన్నది. కొత్త ప్రైవసీ పాలసీ భారత చట్టాలను ఉల్లంఘిస్తున్నదని స్పష్టం చేసింది. పాలసీలోని అంశాలు, కొత్తగా చేసిన మార్పులు సమాచార గోప్యతను, భద్రతను భంగపరిచే విధంగా ఉన్నాయని, భారత వినియోగదారుల హక్కులను ఉల్లంఘిస్తున్నాయని పేర్కొన్నది. ఐరోపా దేశాల్లో ఒకలా, ఇండియాలో ఒకలా వాట్సా ప్ పాలసీ విధానం ఉండటంపై ఆగ్రహ ం వ్యక్తం చేసింది. ‘కోట్లాది మంది భారతీయులు వాట్సాప్ వాడతారని మీకు నిస్సందేహంగా తెలుసు. సమాచార గోప్యత విషయంలో రాజీపడేలా నిబంధనలు తీసుకురావడం అన్యాయమే కాదు బాధ్యతారాహిత్యం కూడా. భారత పౌరుల హక్కులను కాపాడటానికి మేం అవసరమైన చర్యలు తీసుకొంటాం’ అని హెచ్చరించింది. కొత్త ప్రైవసీ పాలసీపై వాట్సాప్ ఒక్కోసారి ఒక్కో ప్రకటన చేస్తున్న సంగతి తెలిసిందే.