హోటళ్లు, దుకాణాల వద్ద శుభ్రత పాటించాలి

- రోడ్లపై చెత్త వేస్తే షాపులను సీజ్ చేస్తాం
- డీపీవో నారాయణ
నెన్నెల: హోటళ్లు, వ్యాపార సముదాయాల వద్ద పరిశుభ్రత పాటించాలని, లేదంటే జరిమానాతో పాటు సీజ్ చేస్తామని యజమానులను డీపీవో నారాయణ హెచ్చరించారు. నెన్నెలలో దుకాణా లు, హోటళ్ల ముందు చెత్తకుప్పలను ఆయన బుధవారం పరిశీలించారు. ఓ హోటల్ వద్ద చెత్తకుప్పలు, మురుగునీటి గుంతలు ఉండడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.2 వేలు జరిమానా విధించారు. స్వీట్ హౌస్ ముందు చెత్త కుప్పలు, ప్లాస్టిక్ కవర్లు పడేయడంతో రూ. వెయ్యి జరిమానా విధించారు. ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేసిన వారికి రూ.10 వేల జరిమానా విధించాలని, చెల్లించలేదంటే నోటీసులు ఇచ్చి దుకాణాలను సీజ్ చేయాలని సర్పంచ్ తోట సుజాతను ఆదేశించారు. గ్రామ పంచాయతీ ట్రాక్టర్లోనే చెత్తను వేయాలని సూచించారు. చెత్త బుట్టలను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. బంజరుదొడ్డిలో ఉన్న పశువులను చూసి, వాటికి మేత, నీటిని అందించాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట డీఎల్పీవో ఫణీందర్, ఎంపీవో మహేశ్, ఉప సర్పంచ్ పుప్పాల అంజన్న, శ్రీనివాస్ ఉన్నారు.
తాజావార్తలు
- అతను తెలియక తప్పు చేశాడు: బీహార్ సీఎం
- బీజేపీలోకి నటుడు మిథున్ చక్రవర్తి?
- ఇన్కం టాక్స్ దాడులపై స్పందించిన హీరోయిన్ తాప్సీ
- బుమ్రా, అనుపమ పెళ్లిపై వచ్చిన క్లారిటీ..!
- అశ్విన్, అక్షర్.. వణికిస్తున్న భారత స్పిన్నర్లు
- బీజేపీలో చేరిన బెంగాల్ కీలక నేత దినేశ్ త్రివేది
- హాట్ ఫొటోలతో హీటెక్కిస్తున్న పూనమ్ బజ్వా
- కన్యాకుమారి లోక్సభ.. బీజేపీ అభ్యర్థి ఖరారు
- మహేష్ బాబు కొత్త కార్వ్యాన్ ఇదే..!
- ఆ ఐదు రాష్ట్రాల్లోనే అత్యధికంగా కొత్త కేసులు