హైదరాబాద్ : రాజ్భవన్లో ఉన్నతాధికారులతో గవర్నర్ తమిళిసై పుదుచ్చేరి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఆరోగ్యవంతమైన రాష్ర్ట సాధనకు ప్రజలు కృషి చేయాలని గవర్నర్ పిలుపునిచ్చారు. మహమ్మారి ప్రబలకుండా అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. సమష్టి కృషితో ఆరోగ్యవంతమైన రాష్ర్టాన్ని సాధించుకోగలం అని చెప్పారు. సెకండ్ వేవ్లో పిల్లలు కొవిడ్ బారినపడటం ఆందోళన కలిగించే విషయమన్నారు. కొవిడ్ చికిత్సలో 2-డీజీ ఔషధం గేమ్ చేంజర్గా పని చేస్తుందన్నారు. ఈ ఔషధం సత్ఫలితాలు ఇస్తుందని ఆశిస్తున్నానని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు.