మహబూబ్నగర్ : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో లాక్డౌన్ పటిష్టంగా అమలవుతున్నది. ఉదయం 10 గంటల తర్వాత రహదారులపై వాహనాల రాకపోకలు దాదాపుగా తగ్గిపోయాయి. మహబూబ్నగర్ పట్టణంలో ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కొద్దిసేపు లాక్ డౌన్ను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. కాగా, అత్యవసర పనుల మీద వచ్చే వాళ్లను పోలీసులు అనుమతిస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలోని ప్రధాన పట్టణాలైన మహబూబ్ నగర్, నారాయణపేట, గద్వాల, మక్తల్, వనపర్తి, నాగర్ కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, జడ్చర్ల తదితర పట్టణాల్లో పటిష్టంగా అమలు అవుతున్నది.
అనుమతి ఉన్న మెడికల్ షాపులు, దవాఖానలు, పెస్టిసైడ్, ఫర్టిలైజర్ దుకాణాలు మొదలైన అనుమతి ఉన్నవి మినహా మిగతా వాణిజ్య వ్యాపార సముదాయాలను మూసివేశారు. లాక్ డౌన్ ప్రభావంతో రహదారులు పూర్తిగా బోసిపోయి కనిపిస్తున్నాయి.
అత్యవసర పరిస్థితుల్లో వాహనాల వాసుల కోసం https://policeportal.tspolice.gov.in/ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
సహృదయతను చాటుకున్న ఏసీపీ ఉమేందర్
సెల్ ఫోన్ కోసం.. 40 కిలోమీటర్ల సైకిల్ సవారీ
కరోనాతో మేడారం పూజారి భార్య మృతి
నర్సుల సేవలు వెలకట్టలేనివి : మంత్రి సత్యవతి రాథోడ్
తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే పెద్ది
సేవకు మరో రూపం నర్సులు : మంత్రి శ్రీనివాస్ గౌడ్