కడప జిల్లా బెరైటీస్ గనుల వద్ద ఘటన
హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): ఏపీలో ప్రమాదవశాత్తు జిలెటిన్ స్టిక్స్ పేలి పది మంది దుర్మరణం చెందారు. పలువురు గాయపడ్డారు. కడప జిల్లా కలసపాడు మండలం తిరుమలకొండ సమీపంలోని బెరైటీస్ గనుల వద్ద శనివారం ఈ ఘటన చోటుచేసుకున్నది. బద్వేలు నుంచి ముగ్గురాళ్ల గనికి వాహనంలో జిలెస్టిన్ స్టిక్స్ను తీసుకొస్తుండగా అవి పేలిపోయాయి. పేలుడుధాటికి మృతదేహాలు తునాతునకలయ్యాయి. మృతదేహాలు ఛిద్రమై గుర్తుపట్టరాకుండా మారాయి. పేలుడుతో వాహనం కూడా తుక్కుతుక్కు అయింది. ఈ ఘటనపై ఏపీ సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.