అమృత్సర్: పంజాబ్లో ఏవియన్ ఇన్ప్లూయెంజా వైరస్ కలకలం రేపింది. లూథియానా జిల్లాలో ఇటీవల తరచూ పక్షులు చనిపోతుండటంతో ఆ జిల్లా వైద్యాధికారులు పక్షుల కళేబరాలకు పరీక్షలు చేయించారు. ఈ పరీక్షల్లో ఏవియన్ ఇన్ఫ్లూయెంజా కారణంగా అవి చనిపోతున్నాయని తేలింది. దాంతో జిల్లాలోని అన్ని పౌల్ట్రీ ఫామ్స్లోని కోళ్లకు పరీక్షలు నిర్వహించగా.. కిలా రాయ్పూర్లోని సుబా సింగ్ ఫౌల్ట్రీ ఫామ్లో కోళ్లకు ఏవియన్ ఇన్ఫ్లూయెంజా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది.
దాంతో లూథియానా నగర డిప్యూటీ కమిషనర్ వారిందర్ శర్మ నగర పరిధిలోనే ఉన్న కిలా రాయ్పూర్ ఫామ్లో పక్షులన్నింటిని ధ్వంసం చేయాలని ఆదేశించారు. అదేవిధంగా నగర పరిధిలోని మిగతా ఫామ్స్లో కూడా పరీక్షలు చేసి పక్షులను ధ్వంసం చేయాలని ఆదేశించారు. ఇందుకోసం తొమ్మిది మంది సభ్యులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
మేకను రక్షించుకోబోయి.. సింహం పంజాకు బలి..!
కేంద్రం తొత్తులా ఈసీ.. సంస్కరణలు చేయాల్సిందే: మమతాబెనర్జి
కంగనా రనౌత్కు కరోనా పాజిటివ్
కరోనాతో మరో ప్రముఖ నటుడు మృతి
ఐఎన్ఎస్ విక్రమాదిత్యలో అగ్ని ప్రమాదం
క్రికెటర్ భువనేశ్వర్ యాంకర్ శ్యామలకు సోదరుడా?