కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు లక్షల మంది వైరస్ బారిన పడుతున్నారు. వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. సెలబ్రిటీలు సైతం కరోనా బారిన పడడం ఆందోళన కలిగిస్తుంది. రోజుకు ఇద్దరు లేదా ముగ్గురు సెలబ్స్ కరోనాతో కన్నుమూస్తున్నారు. ఈ పరిస్థితులు చూస్తుంటే అందరిలో భయాందోళనలు కలుగుతున్నాయి.
తాజగా ప్రముఖ నటుడు, దర్శకుడు భాగ్యరాజ్ ఆయన సతీమణికి కరోనా సోకింది. ఈ విషయాన్ని వారి తనయుడు శాంతను భాగ్యరాజ్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. నా తల్లిదండ్రులు భాగ్యరాజ్, పూర్ణిమా భాగ్యరాజ్లకు కరోనా పాజటివ్గా నిర్ధారణ అయింది. వైద్యుల సలహా మేరకు మా కుటుంబంతో పాటు వ్యక్తిగత సిబ్బంది అందరం క్వారంటైన్కు వెళ్లాం. ఈ మధ్య కాలంలో మమ్మల్ని కలిసిన వారు తప్పక పరీక్షలు చేయించుకోండి అని శాంతను పేర్కొన్నారు.