వ్యవసాయ యూనివర్సిటీ, మే 7: జంతువుల నుంచీ మనుషులకు కరోనా వైరస్ సోకే అవకాశం లేకపోలేదని పీవీ నర్సింహారావు తెలంగాణ పశువైద్య రాష్ట్ర ప్రధాన ల్యాబ్ (రుస్కా) అధిపతి డాక్టర్ మేకల లక్ష్మణ్ తెలిపారు. మనుషుల నుంచి అన్ని జీవాలకు వైరస్ సోకుతున్నదని, మళ్లీ వాటినుంచి మనుషులకు సోకే అవకాశాలు ఉన్నట్టు వెల్లడించారు. ఇంట్లో ఉన్నవ్యక్తికి కరోనా పాజిటివ్ ఉం టే పెంపుడు జంతువులైన కుక్కలు, పిల్లలు, కోళ్లు.. ఇలా ప్రతివాటికి వైరస్ సోకి, వాటి ద్వారా మళ్లీ మన కుటుంబసభ్యులకు వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఒక గొర్రెల కాపరి నుంచి గొర్రెలకు, గొర్రెలనుంచి ఇతర కాపరులకు వచ్చే అవకాశం ఉందని ఉదహరించారు. ఇలాం టి ప్రమాదకరమైన సంఘటనలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కరోనా గతం కన్నా ప్రస్తుతం ప్రమాదకరంగా ఉందని , ప్రతిఒక్కరూ మాస్కు, శానిటైజర్ ఉంచుకోవాలని సూచించారు.