భద్రాద్రి కొత్తగూడెం : నిషేధిత సీపీఐ(మావోయిస్టు) కు చెందిన ఐదుగురు మిలీషియా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం కూర్నపల్లి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. భద్రాచలం ఏఎస్పీ జి.వినిత్ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టుబడ్డ మిలీషియా సభ్యులు ఛత్తీస్గఢ్ రాష్ట్రం కిస్టారం పోలీస్ స్టేషన్ పరిధిలోని నిమ్మలగూడెంకు చెందినవారన్నారు. నిందితులు కొవ్వాసి అడమయ్య, మదకం దుర్గారావు, వీకో సులా, యూకే సారయ్య, మాడివి గంగయ్య గా సమాచారం. కూంబింగ్ ఆపరేషన్ సందర్భంగా వీరిని అరెస్టు చేసినట్లు ఏఎస్పీ తెలిపారు.