తిరువనంతపురం: ఎన్నో దశాబ్దాల చరిత్ర కలిగిన కేరళ అసెంబ్లీలో తొలిసారి ఓ ఆసక్తిర దృశ్యం కనిపించబోతున్నది. త్వరలో మామ, అల్లుడు కలిసి ఒకేసారి శాసనసభలో అడుగుపెట్టబోతున్నారు. ఇంతకూ ఎవరా మమా అల్లుళ్లు అనుకుంటున్నారా..? వాళ్లే కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఆయన అల్లుడు మహ్మద్ రియాజ్. కొత్తగా కొలువుదీరబోయే అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా మామ, ఎమ్మెల్యేగా అల్లుడు దర్శనమివ్వబోతున్నారు.
కొత్తగా ఎమ్మెల్యేగా గెలిచిన మహ్మద్ రియాజ్ పినరయి విజయన్ కుమార్తె వీణ భర్త. వీణ ప్రస్తుతం బెంగళూరులో ఓ ఐటీ సంస్థను నడుపుతున్నారు. విజయన్ తాజా ఎన్నికల్లో కాన్నూర్ జిల్లాలోని తన సొంత నియోజకవర్గం ధర్మదాం నుంచి పోటీచేసి విజయం సాధించారు. ఆయన అల్లుడు రియాజ్ కోజికోడ్లోని వామపక్షాల కంచుకోట బేపోర్ నుంచి గెలుపొందారు. కాగా, గతేడాది జూన్ 17న ముఖ్యమంత్రి అధికారిక నివాసం క్లిఫ్ హౌస్లో వీణా, రియాజ్లు వివాహం చేసుకున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఎమ్మెల్యేగా ఓడిన మమత సీఎం పదవి చేపడుతారా..?
కాంగ్రెస్ కంచుకోటల్లో మమత పాగా.. కారణం తెలుసా..?
Long COVID : కరోనా తగ్గినా దీర్ఘకాలికంగా మూడు లక్షణాలు..!