న్యూఢిల్లీ : కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలకు వైద్య సలహాలు అందించేందుకు 60 మంది వైద్యులు ఆన్లైన్లో సిద్ధమయ్యారు. వివిధ భాషల్లో కరోనాకు సంబంధించిన సమాచారాన్ని చేరవేస్తూ ప్రజలను జాగురూకం చేస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి ఆన్లైన్లో అందుబాటులో ఉంటూ ఉచత సేవలు అందిస్తున్నారు.
దేశవ్యాప్తంగా 60 మంది యువ ఎంబీబీఎస్ వైద్యుల బృందం కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు ఆన్లైన్ చికిత్సను ప్రారంభించారు.హోమ్ ఐసోలేషన్లో ఉండే కోవిడ్ రోగులకు ఉచిత ఆన్లైన్ చికిత్స అందిస్తున్నారు. ఈ వైద్యులు ప్రతి భాషలోని మందుల గురించి రోగులకు సలహా ఇస్తున్నారు. రోగులు కరోనా గురించి పాజిటివ్గా ఆలోచించకుండా చేస్తున్నారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని చిరయు దవాఖానలో పనిచేస్తున్న డాక్టర్ రహత్ పటేల్ చొరవ ఇది.
దేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు పెరిగిపోయి దవాఖానల్లో బెడ్లు దొరకడం గగనంగా మారింది. ప్రతీ చిన్న ఆరోగ్య సమస్యకు బెదిరిపోతూ దవాఖానలకు పరిగెత్తడం అలవాటుగా మారింది. ఈ నేపథ్యంలో ఇంటి వద్దనే ఐసోలేషన్లో ఉండేందుకు రోగులకు ధైర్యాన్నిస్తున్నారు. ఐసోలేషన్లో ఉంటున్న సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ఏఏ మందులు ఎలా వాడాలి.. పాజిటివ్ థింకింగ్ ఎలా అలవర్చుకోవాలి.. అనే విషయాలను వారితో పంచుకుంటున్నారు. సోషల్ మీడియాలో మందుల కోసం సెర్చ్ చేసి అనవసరంగా హ్యాకర్ల చేతుల్లోకి పోయి డబ్బులో పోగొట్టుకోవద్దని వీరు సలహా ఇస్తున్నారు.
డాక్టర్ రహత్ పటేల్, ఉజ్జయిని, భాష: హిందీ, ఇంగ్లిష్. మొబైల్- 9425916599
డాక్టర్ చిత్ర, గురుగ్రామ్ భాష: హిందీ, ఇంగ్లిష్, పంజాబీ. ఫోన్- 8816055114
డాక్టర్ సిద్ధార్థ్ మిశ్రా, ముంబై, భాష: హిందీ, ఇంగ్లిష్. ఫోన్- 7976019014
డాక్టర్ నుపూర్; ఢిల్లీ, భాష: హిందీ, ఇంగ్లిష్, మరాఠీ, కన్నడ. ఫోన్- 8657422089
డాక్టర్ ప్రియాంక పాటిల్, జలోన్ , భాష: మరాఠీ
డాక్టర్ మీనాల్ హడా, తమిళనాడు, భాష: తమిళం
ఈ బృందం గత వారం రోజులుగా దాదాపు రెండు వేల మంది రోగులను సంప్రదించింది.
స్టెరాయిడ్లు తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరుగుతున్నందున డాక్టర్ సలహా లేకుండా స్టెరాయిడ్లు తీసుకోకండి. ముఖ్యంగా డయాబెటిక్ రోగులు. ఇది ఎముకలను బలహీనపరుస్తుంది.
డయాబెటిక్ రోగి కోవిడ్తో బాధపడుతుంటే టీ , కాఫీ తీసుకోకుండా ప్రత్యేక శ్రద్ధ వహించండి. బదులుగా యాపిల్ తినండి. ఆపిల్లో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల కడుపులో అసౌకర్యం ఉండదు.
సాధారణ కోవిడ్ రోగులు ఈ సమయంలో వోట్మీల్, యాపిల్, దానిమ్మ, నారింజ తీసుకోవాలి. తేలికపాటి ఆహారం తినాలి. కంటినిండా నిద్రపోవాలి. సానుకూలంగా ఆలోచించాలి. ధ్యానం చేయాలి. జ్ఞాపకాలను డైరీలో రాయడం అలవాటు చేసుకోండి. టైమ్పాస్ కోసం డ్రాయింగ్, పెయింటింగ్, కవితలు రాయడం, అల్లికలు వంటివి నేర్చుకోవాలి.
అద్వానీ రథయాత్ర కారకుడు ప్రమోద్ మహాజన్.. చరిత్రలో ఈరోజు
లాక్డౌన్ తరహా ఆంక్షలు పొడగించిన పంజాబ్ ప్రభుత్వం
ప్రపంచంలోని పొడవైన సస్పెన్షన్ బ్రిడ్జి ప్రారంభం
బంగ్లాదేశ్లో రెండు పడవల ఢీ.. 25 మంది మృతి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..