గువహటి : అసోం అసెంబ్లీ ఎన్నికల్లో పాలక బీజేపీ విస్పష్ట మెజరిటీ దిశగా సాగుతోంది. మొత్తం 126 అసెంబ్లీ స్ధానాలకు గాను కాషాయ పార్టీ 76 స్ధానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, కాంగ్రెస్ పార్టీ 41 స్ధానాల్లో ముందంజలో ఉంది.
ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ ఆర్ధిక మంత్రి, బీజేపీ స్టార్ క్యాంపెయినర్ హిమంత్ బిశ్వ శర్మ మజౌలి, జలుబరి స్ధానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. బీజేపీ సాధారణ మెజారిటీ సాధించే దిశగా దూసుకుపోతోంది. ఇక మూడు దశల్లో జరిగిన అసోం అసెంబ్లీ ఎన్నికల్లో 82.04 శాతం పోలింగ్ నమోదైంది.